Home » Chandrababu Naidu
మూడు దశాబ్ధాల పోరాటం ఫలించింది. ఎందరో నాయకుల ఆకాంక్ష నెరవేరింది. 30 ఏళ్ల పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు.. తమ హక్కుల కోసం పోరాటం.. తమ కళ నెరవేరిందనుకున్న సమయంలో న్యాయస్థానం రూపంలో అడ్డంకులు.. వెరసి.. మరో 20 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
నెల్లూరు జిల్లాలో మాస్ పొలిటీషియన్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. రాజకీయాల్లో ఆయన స్టైలే వేరు. తాను నమ్మిన వ్యక్తుల కోసం ఎంతకైనా తెగిస్తారు. తనను అనుమానించినా.. అవమానించినా ఆత్మగౌరవాన్ని చంపుకుని ఒక్కనిమిషం ఉండరు.
ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. ఐదేళ్ల వైసీపీ పాలన చూసిన తర్వాత ఓటర్లు తమ నిర్ణయాన్ని వెల్లడించారు. దీంతో కనీసం ప్రతిపక్ష హోదా సైతం వైసీపీకి దక్కలేదు. ప్రజల నిర్ణయంతో ఆ పార్టీ అధినేత జగన్తో పాటు నాయకులంతా ఆశ్చర్యపోయారు.
ఆంధ్రప్రదేశ్లో శాంతి, భద్రతలు క్షీణించాయని.. వైసీపీ కార్యకర్తలను రాష్ట్రంలో బతకనీయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసిన ధర్నా బెడిసికొట్టిందా.. హస్తినలో నిరసనతో ఆయన ఏం సాధించారు.
జులై 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఇవాళ సమావేశం కానున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో శనివారం మధ్యాహ్నం ఈ భేటీ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.
జగన్ ఏలుబడిలో కొన్ని కీలక రంగాల్లో జరిగిన విధ్వంసంపై రూపొందిస్తున్న శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం ఏడు శ్వేతపత్రాలకు గాను నాలుగింటిని సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి.. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ప్రమాణ స్వీకారం చేశాక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు...
రాష్ట్రంలో గురుకుల పాఠశాలలను టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు తొలిసారిగా ప్రారంభించారని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం విశాఖపట్నం జిల్లా సింహాచలం అడవివరం సమీపంలోని గురుకుల పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త షెడ్యూలు విడుదల చేసింది. అక్టోబరు 3 నుంచి 20వ తేదీ వరకు రోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.