Home » Chandrababu Naidu
ఎల్లుండి నుండి వంద అన్న క్యాంటీన్లలో ఆహారం సిద్దంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గుంటూరులోని చుట్టగుంటలో అన్నక్యాంటీన్ ఏర్పాటు పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం అందుకు సంబంధించిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మందుబాబులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త మద్యం బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. అందులోభాగంగా కొత్త మద్యం పాలసీ.. ప్రొక్యూరిమెంట్ పాలసీపై ఎక్సైజ్ శాఖ కసరత్తు జరుపుతుంది. ఆ క్రమంలో మద్యం కొనుగోళ్ల పాలసీపై మద్యం కంపెనీలతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు.
జిల్లా యూనిట్గా ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన తమ పార్టీ పొలిట్బ్యూరో సమావేశంలో వెల్లడించినట్లు సమాచారం.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకానికి పూర్వ వైభవం తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. గత ఐదేళ్లూ ఉపాధి హామీ పథకాన్ని జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో కేంద్ర అధికారుల వద్ద మన అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి!
చింతకాయల అయ్యన్నపాత్రుడు.. తెలుగుదేశంలో చేరి తన రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. ఆ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్నారు. నీతి నిజాయితీలకు మారు పేరుగా నిలిచారు. అలాగే సమర్థవంతమైన నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు.. ఆ పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీలో సీనియర్లు కనిపించడం లేదట. అధికారంలో ఉన్నప్పుడు రోజూ మీడియా ముందు కనిపించే నేతలు.. గత రెండు నెలలుగా ఏమైందో ఏమో గాని ప్రజల్లో కనిపించడంలేదనే టాక్ వినిపిస్తోంది.
జిల్లా కలెక్టర్ల సమావేశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాన్ని 5వ తేదీ ఒక్కరోజే నిర్వహించాలని నిర్ణయించింది. అదే రోజు వివిధ శాఖలపై సమీక్ష చేయనుంది.
ప్రముఖ భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారిణి యామినీ కృష్ణమూర్తి(84) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. ఏడు నెలల నుంచి ఢిల్లీలోని అపోలో ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు.
రాష్ట్రంలో దెబ్బతిన్న వ్యవస్థలన్నింటినీ వంద రోజుల్లో గాడిలో పెడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శనివారం టీడీపీ ప్రధాన కార్యాలయంలో గ్రీవెన్స్ సందర్భంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకునేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్ని వినతులు వచ్చినా...
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు ఇంకా పూర్తికాలేదు. కానీ ఐదేళ్ల జగన్ పాలనతో పోల్చినప్పుడు 50 రోజుల్లోనే సీఎంగా చంద్రబాబు మార్క్ పాలన ఎలా ఉంటుందో ప్రజలకు అర్థమైంది.