Home » Chandra Babu
రామోజీరావు లాగా ఒక్క రోజు బతికినా చాలు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, సంగీత దర్శకుడు కీరవాణి అన్నారు. రామోజీరావులాగా వ్యాపారం చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేలమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కలలుగంటారు.
చాలా బాధాకరం. యుగపురుషుడు... ఒక పర్పస్ కోసం పుట్టిన వ్యక్తి. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. రామోజీరావు చివరి శ్వాస వరకూ సమాజహితం కోసం పని చేశారు. తెలుగు జాతి కోసం కృషి చేశారు. ఓ సాధారణ కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా ఎదిగారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో జిల్లాలో ఉద్యాన రైతులు కష్టాలను ఎదుర్కొన్నారు. హార్టికల్చర్ డీలా పడింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉద్యాన రైతులకు జగన మొండి చేయి చూపారు. టీడీపీ హయాంలో ప్రతి ఏటా ఉద్యాన రైతులకు పలు రకాల రాయితీలను అందించి ఆదుకున్నారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక రాయితీలను తగ్గించింది. రైతుల్లో కొందరికే లబ్ధి చేకూరింది. ఎక్కువ శాతం రైతులకు అన్యాయం జరిగింది. టీడీపీ హయాంతో పోలిస్తే వైసీపీ పాలనలో 50 శాతానికిపైగా నిధులను తగ్గించారు. ఐదేళ్లుగా అరకొరగా విధించిన టార్గెట్లకూ నిధులు సకాలంలో విడుదల చేయలేదు. దీంతో రైతులకు సరైన సమాధానం ...
ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లుగా రేషన్ డీలర్లకు వైసీపీ ప్రభుత్వం నరకం చూపించిందని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలా మాధవరావు (Divi Leela Madhav Rao) అన్నారు. నాలుగు దశాబ్దాల రేషన్ డీలర్ల (Ration Dealers) చరిత్రలో ఎప్పుడూ పడని నరకాన్ని జగన్ హయంలో అనుభవించామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావు అస్తమయంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. అక్షర యోధుడుగా పేరున్న రామోజీ తెలుగు రాష్ట్రాలకు, దేశానికి అందించిన సేవలను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
నరేంద్ర మోదీ సరైన సమయంలో భారత దేశానికి లభించిన సరైన నాయకుడని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. తన విధానాలను సమర్థంగా అమలు చేయడంలో ఆయన్ను మించిన వారు లేరని.. విజన్ ఉన్న ఆయన హయాంలో ఏది అనుకుంటే అది సాధించగలమని ప్రశంసించారు. శుక్రవారమిక్కడ పార్లమెంటు సెంట్రల్ హాలులో శుక్రవారం జరిగిన ఎన్డీయే ఎంపీల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ తామకు మంత్రి పదవులు ముఖ్యం కాదన్నారు. అయినా తమ పార్టీ పదవుల కోసం ఎప్పుడు సంప్రదింపులు జరపదని తెలిపారు.
లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడటంతో ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ సాధించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ మాట్లాడారు.