Home » Chandra Babu
కేంద్ర ప్రభుత్వ పాలనకు సంబంధించి ఇక అన్ని నిర్ణయాలూ ఏకాభిప్రాయంతోనే తీసుకునేందుకు కృషి చేస్తానని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. అన్నింటికన్నా దేశం ముఖ్యం అన్న సూత్రానికి కట్టుబడి ఎన్డీఏ కూటమి పని చేస్తుందని చెప్పారు. శుక్రవారం ఉదయం పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాలులో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకానీ తామకు మంత్రి పదవులు ముఖ్యం కాదన్నారు. అయినా తమ పార్టీ పదవుల కోసం ఎప్పుడు సంప్రదింపులు జరపదని తెలిపారు.
లక్షలాది మంది కార్యకర్తలు రాత్రింబవళ్లు కష్టపడటంతో ఎన్డీఏ కూటమికి భారీ మెజార్టీ సాధించిందని ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీఏ మిత్రపక్షాల సమావేశంలో మోదీ మాట్లాడారు.
దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్డీయే కూటమి ఎంపీల భేటీ జరిగింది. ఎన్డీయే పక్ష నేత నరేంద్ర మోదీని ఎన్నుకుంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదన చేశారు. ఈ ప్రతిపాదనకు నూతన ఎంపీలు అందరూ ఆమోదం తెలిపింది. దీంతో మూడోసారి ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగుమమైంది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు.
లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమాల్లో బిజీగా ఉంది. పార్లమెంట్ సెంట్రల్ హాలులో ఎన్డీఏ పక్షాల నేత సమావేశం జరుగుతోంది. ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ పేరును రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను అమిత్ షా, నితిన్ గడ్కరీ బలపరిచారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికల్లో కూటమి భారీ విజయంతో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మెుదట జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఆరోజున మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తేదీని మార్చాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి భారీ విజయం సాధించింది. ఈ నెల 12వ తేదీన ప్రభుత్వం కొలువుదీరనుంది. ఆ లోపే వైసీపీ నుంచి జంపింగ్స్ స్టార్ట్ అయ్యాయి. వైసీపీ ముఖ్యనేత రావెల కిశోర్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దళితుల సంక్షేమం తెలుగుదేశం పార్టీతో సాధ్యం అవుతోందని ప్రకటించారు.
ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేశారని టీడీపీ చెన్నై విభాగానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు. టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆ పార్టీ చెన్నై విభాగ అధ్యక్షుడు డి.చంద్రశేఖర్ శుభాకాంక్షలు తెలిపారు.
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు.
ఆంధ్రప్రదేశ్లో కూటమి (Kutami) 164స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ చంద్రబాబు (Chandrababu), పవన్ కల్యాణ్కు పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.