• Home » CBI

CBI

Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేస్తారా..?

Mamata Banerjee: మరో బంగ్లాదేశ్ చేస్తారా..?

ప్రతిపక్షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటికాలిపై లేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ మృతి అంశాన్ని రాజకీయం చేయడంపై ధ్వజమెత్తారు. సీపీఎం, బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్‌ను మరో బంగ్లాదేశ్‌లా మారుస్తారా ఏంటీ అని విరుచుకుపడ్డారు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను.. అధికారం కోసం నాకు అత్యాశ ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు.

Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌..

Supreme Court: జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌..

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.

Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు

Kolkata RG Kar Hospital: ట్రైయినీ వైద్యురాలి పోస్ట్‌మార్టం నివేదికలో సంచలన విషయాలు

ట్రైయినీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి మాట్లాడారు. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు.

CBI: కోల్‌కతా చేరుకున్న సీబీఐ.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో దర్యాప్తు

CBI: కోల్‌కతా చేరుకున్న సీబీఐ.. వైద్యురాలిపై హత్యాచారం కేసులో దర్యాప్తు

పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతా(Kolkata)లోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్‌కతా చేరుకుంది.

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

Supreme Court : కవితకు మధ్యంతర బెయిల్‌ ఇవ్వలేం

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్‌ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

Bengaluru : డీకే శివకుమార్‌ కేసులో తీర్పు రిజర్వు

కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.

Mamata Banerjee: ఆదివారం వరకే గడువు.. ఏంటంటే..?

Mamata Banerjee: ఆదివారం వరకే గడువు.. ఏంటంటే..?

ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్‌‌లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.

Delhi: కోచింగ్ సెంటర్లలో అధికారుల తనిఖీలు

Delhi: కోచింగ్ సెంటర్లలో అధికారుల తనిఖీలు

రావూస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌ ఇష్యూతో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. ఒక్కో కోచింగ్ సెంటర్‌ను పరిశీలిస్తున్నారు. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణాలు, సరైన అనుమతుల గురించి నిశీతంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

Delhi : కోచింగ్‌ సెంటర్‌లో మరణాల కేసు సీబీఐకి

ఢిల్లీలో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Delhi Coaching Centre: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

Delhi Coaching Centre: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్‌ సెల్లార్‌ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి