Home » CBI
అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్పై మద్రాస్ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.
మద్యం కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని సీబీఐ, ఈడీ కోర్టు జూలై 22 వరకు పొడిగించింది.
అక్రమ ఆస్తుల వ్యవహారంలో సీబీఐ ఎఫ్ఐఆర్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది.
‘దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన 10 ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర బీజేపీది.. సుప్రీంకోర్టుతో చీవాట్లు తింటూనే.. ఈడీ, సీబీఐ, ఐటీలతో బెదిరించి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది.
నీట్ ప్రవేశ పరీక్ష లీక్ కేసులో రాకీ అలియాస్ రాకేష్ రంజన్ అనే మరో నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అదుపులోకి తీసుకుంది. బిహార్లోని నవాడ అతని స్వగ్రామం. రాకీ కొన్ని సంవత్సరాలుగా రాంచీలో ఓ రెస్టారెంట్ నడుపుతున్నాడు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ(NEET-UG 2024) పేపర్ లీకేజీపై సుప్రీం కోర్టు (Supreme Court) గురువారం సుదీర్ఘంగా విచారించింది. అనంతరం తదుపరి విచారణను జులై 18కి వాయిదా వేసింది. మొదట దీనిపై శుక్రవారమే విచారణ చేపడతామని చెప్పినప్పటికీ.. సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు ఇవాళే విచారణ చేపట్టి వాయిదాను పొడగించింది.
ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ట్రస్టులో పెట్టుబడులు పెట్టి మోసపోయిన బాధిత ప్రజలకు న్యాయం చేస్తామని సీసీఎస్ డీసీపీ శ్వేత పేర్కొన్నారు.
గుంతకల్లు, జూలై 6: ఎప్పుడూ ఒక శాతం కమీషన(లంచం) తీసుకునేవారట..! కానీ ఈసారి ఇంకొక్కశాతం ఎక్కువ కావాలని అడిగారట. ఆ దురాశే వారిని ఊచలు లెక్కబెట్టేలా చేసింది. సీబీఐ వలలో చిక్కి.. పరువు బజారున పడేలా చేసింది. గుంతకల్లు రైల్వే డివిజన కేంద్రంలో తొలిసారి సీబీఐ దాడులు జరగడానికి కారణం ఇదే అంటున్నారు. డీఆర్ఎం కార్యాలయంలో ఓ శాఖాధికారిపై కాంట్రాక్టర్లు చేసిన ఫిర్యాదు అవినీతి వృక్షాలను పెకిలించింది. రైల్వే అకౌంట్స్ విభాగంలో అవినీతి బురద డీఆర్ఎం కార్యాలయానికి మాసిపోని మరకలను అంటించింది. తిరుపతిలో ఆరు నెలల కిందట జరిగిన సీబీఐ దాడులు మరువకనే.. అంతకు మించిన అవినీతిని బయట పెట్టేదాడులు గుంతకల్లులో ..
Andhrapradesh: అవినీతి కేసులో గుంతకల్లు డీఆర్ఎం వినీత్ సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన ఓ రైల్వే కాంట్రాక్టర్ను రైల్వే అధికారులులంచం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రైల్వే అధికారులపై సీబీఐకి కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. కాంట్రాక్టర్ రమేష్ రెడ్డి ఫిర్యాదు మేరకు రెండు రోజులు పాటు అధికారులు తనిఖీలు చేపట్టారు.
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యూడీషియల్ కస్టడీని ఈ నెల 18 వరకు రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించింది.