Home » CBI
పశ్చిమ బెంగాల్ కోల్కతా(Kolkata)లోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో వైద్యారాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో సీబీఐ(cbi) దర్యాప్తు ప్రారంభించింది. సీబీఐ ఈ కేసులో ఇప్పటికే కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, తాజాగా ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ నుంచి సీబీఐ బృందం కోల్కతా చేరుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సోమవారం సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది.
కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్పై సీబీఐ నమోదుచేసిన అక్రమాస్తుల కేసుకు సంబంధించి ప్రభుత్వం అనుమతులను వాపసు తీసుకోవడంపై దాఖలైన కేసు విచారణ సోమవారం ముగిసింది. దీనిపై తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వులో పెట్టింది.
ట్రైనీ డాక్టర్ మృతి అంశం పశ్చిమ బెంగాల్లో ప్రకంపనలు రేపుతోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని వైద్య విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు చేరింది. దీంతో బెంగాల్ పోలీసులకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అల్టిమేటం జారీ చేశారు. డాక్టర్ మృతి కేసును ఆదివారం లోపు ముగించాలని గడువు విధించారు. లేదంటే సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని స్పష్టం చేశారు.
రావూస్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్ ఇష్యూతో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. ఒక్కో కోచింగ్ సెంటర్ను పరిశీలిస్తున్నారు. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణాలు, సరైన అనుమతుల గురించి నిశీతంగా పరిశీలిస్తున్నారు. నిబంధనలను తుంగలో తొక్కిన కోచింగ్ సెంటర్లపై ఉక్కుపాదం మోపుతున్నారు.
ఢిల్లీలో సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో ముగ్గురు అభ్యర్థులు మరణించిన ఘటనపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
ఓల్డ్ రాజేందర్ నగర్లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్ సెల్లార్ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.
సీబీఐ దర్యాప్తు చేస్తున్న ఎక్సైజ్ పాలసీ కేసులో రెగ్యులర్ బెయిల్ కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఢిల్లీ హైకోర్టు సోమవారంనాడు రిజర్వ్ చేసింది. విచారణ సందర్భంగా కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వరాదని సీబీఐ వాదించింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయ ఫైళ్ల కాల్చివేత కేసు విచారణ సీఐడీ చేతుల్లోకి వెళ్తోంది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగానే సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ బుధవారం రాత్రి నుంచి మదనపల్లెలోనే మకాం వేశారు. సీఐడీ ఆధ్వర్యంలో 60 మంది
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావును కోర్టులో హాజరుపర్చాలని నాంపల్లి కోర్టు ఇదివరకు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.