Home » CBI
కోల్కతా(Kolkata)లోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్పై హాత్యాచారం(Kolkata trainee doctor case) చేసి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో సివిక్ పోలీస్ వాలంటీర్, నిందితుడు సంజయ్ రాయ్కి గురువారం (ఆగస్టు 22న) సైకలాజికల్ టెస్ట్ నిర్వహించింది సీబీఐ(CBI). ఆ క్రమంలో సీబీఐ బృందం షాకింగ్ సమాచారం సేకరించినట్లు తెలిపింది.
ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని కోరుతూ పిటిషన్ వేసిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
రాజధాని అమరావతి నిర్మాణానికి చేయూతనిచ్చేందుకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంసిద్ధత వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా.. సీబీఎన్ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు గెజిట్ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది...
కోల్కతాలోని ఆర్జీ కర్ వైద్య కళాశాల, ఆసుపత్రిలోని జూనియర్ డాక్టర్పై అత్యాచారం కేసును సీబీఐ విచారిస్తోంది. ఈ కేసులో నిందితుడైన సంజయ్ రాయ్కు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు కోల్కతా కోర్టు సీబీఐకి అనుమతినిచ్చింది.
కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ-హాస్పిటల్లో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం లోగా దర్యాప్తుపై అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
‘ఒక్కసారి చెబితే... వందసార్లు చెప్పినట్లే’ అన్నది సూపర్ స్టార్ రజినీకాంత్ ‘బాషా’లోని ఓ ఫేమస్ డైలాగ్. ‘వంద మంది ఆర్టీఐ దరఖాస్తులు పెట్టుకున్నా... ఒక్కదానికీ జవాబు చెప్పం’ అన్నది రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్ బాషా తీరు! వైసీపీ హయాంలో ‘సమాచార హక్కు చట్టం’ ఉండీ లేనట్లుగా తయారైంది.
ప్రతిపక్షాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒంటికాలిపై లేశారు. ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్ మృతి అంశాన్ని రాజకీయం చేయడంపై ధ్వజమెత్తారు. సీపీఎం, బీజేపీ నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బెంగాల్ను మరో బంగ్లాదేశ్లా మారుస్తారా ఏంటీ అని విరుచుకుపడ్డారు. నేను మీకో విషయం చెప్పదలుచుకున్నాను.. అధికారం కోసం నాకు అత్యాశ ఎంతమాత్రం లేదని తేల్చి చెప్పారు.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసు విచారణ నుంచి జస్టిస్ సంజీవ్ కుమార్ తప్పుకున్నారు. భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్, ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్ఫోర్స్మెంట్(ED) దాఖలు చేసిన కేసుల విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు.
ట్రైయినీ వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని డాక్టర్ సుభర్ణ గోస్వామి వెల్లడించారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డాక్టర్ సుభర్ణ గోస్వామి మాట్లాడారు. ఆమె శరీరంలో 151 గ్రాముల ద్రవ పదార్థం ఉందన్నారు. ఒక్కరే లైంగిక దాడికి పాల్పడితే.. అంత ద్రవ పదార్థం ఆమె శరీరంలో ఉండదని తెలిపారు.