Home » Case
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఏసీపీ నేతృత్వంలోని బృందం ఆయనను విచారించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడ్ని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు పోలీస్ అధికారుల్ని అరెస్ట్ చేయగా, పెద్ద సంఖ్యలో సాక్షుల్ని విచారించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గురువారం జూబ్లీహిల్స్ పోలీసుల ఎదుట హాజరుకానున్నారు. మరో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు బొల్లం మల్లయ్య, ఫైళ్ల శేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారిగా రాజాకీయ నేతలను పోలీసులు విచారించనున్నారు. చిరుమర్తి లింగయ్య విచారణ తర్వాత మల్లయ్య, శేఖర్ రెడ్డిలను విచారణ చేసే అవకాశముంది.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా, కొడంగల్ లగచర్ల దాడి పథకం ప్రకారమే జరిగిందని.. బయట గ్రామం నుంచి వచ్చి దాడులకు పాల్పడినట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. పట్నం నరేందర్రెడ్డి సెల్ఫోన్ను పోలీసులు సీజ్ చేశారు. ఫోన్ ఓపెన్ చేసేందుకు మెజిస్ట్రేట్ అనుమతి కోరారు.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎ్సఐబీ) కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు పోలీసులు అరెస్టవ్వగా.. తాజాగా ఖద్దరు ప్రమేయంపై విచారణ మొదలైంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు అమెరికాలో గ్రీన్కార్డు మంజూరయింది. అమెరికాలో స్థిరపడిన కుటుంబసభ్యుల ద్వారా గ్రీన్కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలియవచ్చింది. కొన్ని రోజుల క్రితమే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరయింది.
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 27న సాల్ట్ లేక్ ఏరియాలోని ఈస్ట్రన్ జోనల్ కల్చరల్ సెంటర్లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మిథున్ చక్రవర్తి మాట్లాడుతూ, 2026లో పశ్చిమబెంగాల్ పీఠం బీజేపీ వశం కానుందని, లక్ష్యసాధనకు ఏం చేయడానికైనా సిద్ధమని అన్నారు.
విజయసాయిరెడ్డి కుమార్తె నెహారెడ్డి భీమిలి బీచ్ వద్ద సీఆర్జడ్ ప్రాంతంలో సముద్రానికి అతి సమీపంలో శాశ్వత కాంక్రిట్ నిర్మాణం చేపడుతున్నా.. అధికారులు పట్టించుకోవడంలేదని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. అన్ని వివరాలతో నివేదిక సమర్పించాలని జీవీఎంసీకి ఆదేశం..
కేరళ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ చదువుతున్న కొందరు విద్యార్థులు చేసిన పనికి అక్కడి అబ్కారీ పోలీసులు షాక్ తిన్నారు.
ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కేసును ప్రభుత్వం ప్రకాశం ఎస్పీ దామోదర్కు దర్యాప్తు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు గుంటూరు జిల్లా పాలన విభాగం ఏఎస్పీ రమణమూర్తి దర్యాప్తు బాధ్యతలు చూస్తున్నారు. వెంటనే కేసు రికార్డును ప్రకాశం ఎస్పీకు అప్పగించాలని గుంటూరు అడ్మిన్ ఏఎస్పీకు ఆదేశాలు జారీ చేశారు.