Home » Case
Teangana: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడంపై మాజీ మంత్రి హరీష్ స్పందించారు. ఎమ్మెల్యేపై క్రిమినల్ కేసు తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ వేదికగా హరీష్ స్పందిస్తూ... ‘‘ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?’’...
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త నేర న్యాయ చట్టం కింద రాష్ట్రంలో తొలి కేసు హైదరాబాద్ చార్మినార్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. నంబరు ప్లేట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారుపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 281, మోటారు వెహికల్ చట్టం కింద కేసు పెట్టారు.
ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరోసారి చుక్కెదురైంది. ఈడీ, సీబీఐ కేసులకు సంబందించి ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని కోర్టు స్పష్టం చేసింది.
తనపై తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై అవసరమైతే కేసు పెట్టుకోవచ్చని ఓ భర్తకు కర్ణాటక హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఐపీసీలోని సెక్షన్ 211 ప్రకారం కేసు పెట్టవచ్చని తెలిపింది.
విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ మదర్సాలో ఫుడ్ పాయిజన్ జరిగడంతో పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న రాత్రి భోజనం చేసిన పిల్లల్లో 10 మందికి వాంతులయ్యాయి.
పల్నాడు జిల్లా: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. తెలుగు యువత పల్నాడు జిల్లా కార్యదర్శి కొమర శివపై పిన్నెల్లి మాచర్ల కోర్టు వద్ద పిడికిలితో కడుపులో గుద్ది దాడి చేశారని పేర్కొంటూ శివ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులకు కోర్టులో చుక్కెదురైంది. సంచలనం సృష్టించిన ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై అధికారులు ఇటీవల నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఆ అభియోగపత్రాలను పరిశీలించిన న్యాయమూర్తి అందులో వివరాలు, సమర్పించిన ఆధారాలు సమగ్రంగా లేవని పేర్కొంటూ..
పగిడ్యాల( Pagidiala) మండలం ఘణపురం(Ghanapuram)లో వ్యక్తిపై దాడి కేసులో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2013లో నరేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తిపై అప్పటి ఎస్సై మారుతీ శంకర్ దాడి చేశారు. దీనిపై బాధితుడు అప్పట్లో ప్రైవేటు కేసు వేశారు.
తెలంగాణలో సంచలనం సృష్టించిన బాలిక వసంత హత్య కేసులో తాజాగా షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. ఆమె తండ్రే ప్రధాన సూత్రధారి అని పోలీసుల విచారణలో..
పలు పబ్లలో డిస్క్ జాకీ (డీజే)గా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్లో ఉన్న ఇద్దరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీ న్యాబ్) డైరెక్టర్ సందీప్ శాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు.