Home » Case
దేశవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో 5 కోట్లకుపైగా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఓ లిఖితపూర్వక సమాధానం ద్వారా లోక్సభకు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న జుడీషియల్ రిమాండ్ను నాంపల్లి కోర్టు జూలై 31 వరకు పొడిగించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు, మరో నిందితుడు శ్రవణ్ను తమ ఎదుట హాజరుపరచాలని దర్యాప్తు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
హైదరాబాద్: టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్ తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్ తరుణ్ తెలిపారు.
వివాదాస్పద ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్పై కేసు నమోదైంది. మనోరమ ఖేద్కర్ ఓ రైతును తుపాకీ చూపిస్తూ బెదిరించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది.
ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీపై మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ధ్రువ్ రాఠీ పేరిట ఉన్న ఓ పేరడీ ‘ఎక్స్’ ఖాతా నుంచి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు కుమార్తెకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్టు చేసిన నేపథ్యంలో..
గుంటూరు జిల్లా: ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్పై కేసు నమోదయింది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.
‘‘నేను ఇప్పట్లో భారత్కు రాలేను. వీడియో లేదా టెలికాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవ్వగలను’’ అని ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్, ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు స్పష్టం చేశారు.
కొద్దికాలం క్రితం పార్లమెంటు సభ్యత్వం కోల్పోయి తిరిగి 2024 ఎన్నికల్లో పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మరోసారి చిక్కుల్లో పడ్డాడు. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ చైర్పర్సన్ రేశా శర్మపై ఆమె ఇటీవల చేసిన తీవ్ర వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డలో టీడీపీ నేత ఏవీ శ్రీదేవి హత్య కేసులో 6గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 25న పాతూరు వీధిలో శ్రీదేవి హత్య జరిగింది. దీంతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారయ్యారు.