Home » Case
వారంతా రెవెన్యూ ఉద్యోగులు.. ప్రజలు, ప్రభుత్వానికి జవాబుదారీగా ఉండాల్సిన వాళ్లు.. అప్పట్లో వైసీపీ నాయకుల అడుగులకు మడుగులొత్తారు. తాము ప్రభుత్వాధికారులమనే కనీస భయం లేకుండా చేయకూడని పనులు చేశారు. నిబంధనలు పక్కనపెట్టి ప్రభుత్వ ఖజానాకు వందల కోట్లు నష్టం కలిగించారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైళ్ల దహనం కేసులో సీఐడీ అధికారులు రెండోరోజు మంగళవారం కూడా విచారణ కొనసాగించారు. సోమవారం రాత్రి సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆఽధ్వర్యంలో సీఐడీ అధికారులు సబ్కలెక్టరేట్లో విచారణ చేశారు.
డెంగీ కేసులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. రాష్ట్రంలో డెంగీ వ్యాప్తిరేటు 7 శాతానికి చేరుకుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,246 డెంగీ కేసులు నమోదయ్యాయి.
న్యూఢిల్లీ: కోల్కతా కేసులో డాక్టర్ల ఆందోళ కొనసాగుతోంది. ఆర్జీకర్ ఆస్పత్రిపై అర్ధరాత్రిపై విధ్వంసం సృష్టించిన ఘటనలో ఇద్దరు ఏసీపీలు, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించారన్న ఆరోపణలతో వేటు పడింది. ఆస్పత్రిపై విధ్వంసం సృష్టించిన 40 మంది దుండగులు అరెస్టు అయ్యారు.
మేడిగడ్డ బ్యారేజీ సందర్శన సందర్భంగా అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా ఎగరేశారన్న ఆరోపణలతో మహదేవ్పూర్ పోలీ్సస్టేషన్లో నమోదైన కేసులో మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టులో ఊరట లభించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి.
బిత్తిరి సత్తిపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.
పల్లె, పట్నం అనే తేడా లేదు. పండగ, జాతర అని కూడా చూడటం లేదు. ఏ సందర్భం అయినా సరే తమకు లెక్కలేదని ఆకతాయిలు అంటున్నారు. ఇటీవల బోనాల పండగ ఘనంగా ముగిసింది. బోనాల సమయంలో కొందరు ఆకతాయిలు రెచ్చిపోయారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. బాధితులు షీ టీమ్స్కు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది కేసు ఫైల్ చేశారు. బోనాల పండగ సమయంలో అత్యధికంగా 305 మందిపై కేసులు నమోదయ్యాయి.
పెండింగ్ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమయింది.
వాణిజ్యపన్నుల శాఖలో రూ.1000 కోట్ల గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) కుంభకోణంలో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సోమేశ్కుమార్పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు.. మరో ఇద్దరు ఉన్నతాధికారులపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.