Home » Car
New Delhi: కరోనా తరువాత చాలా మంది ప్రజల సొంత వాహనాలు కొనుగోలు చేసేందుకే మొగ్గు చూపుతున్నారు. ప్రజా రవాణాలో ప్రయాణించడం కారణంగా ఏమైనా వ్యాధులు సోకే ప్రమాదం ఉందని భావించి.. చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జల్నాలో ఓ పెట్రోల్ బంకులో ఫ్యూయల్ పోయించుకొని ఓ కారు రాంగ్ రూట్లో వస్తోంది. అదే సమయంలో వేగంగా వస్తోన్న కారు ఆ కారును ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రయాణికుల్లా కారును ఆపి.. కత్తితో డ్రైవర్ను బెదిరించి కారు అపహరించిన ఘటన శంషాబాద్ విమానాశ్రయం ఆవరణలో బుధవారం చోటు చేసుకుంది. అయితే బాధితుడు వెంటనే తేరుకొని పోలీసులు సమచారమివ్వగా.. గంటల వ్యవధిలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు.
వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూతురు చెన్నైలో ర్యాష్ డ్రైవింగ్ చేశారు. రోడ్డు పక్కన పడుకొన్న వ్యక్తి పైనుంచి కారు పోనిచ్చారు. సూర్య అనే వ్యక్తి మద్యం సేవించి బసంత్ నగర్ రోడ్డు పక్కన పడుకున్నాడు. అతనిని గమనించకుండా మస్తాన్ రావు కూతురు మాధురి సోమవారం సాయంత్రం కారు పోనిచ్చారు. దీంతో సూర్య తీవ్రంగా గాయపడ్డారు.
ప్రధాని మోదీకి నెలకు రూ.1.66 లక్షల జీతం అందుతుంది. బేసిక్ పే రూ.50 వేలు ఉంటుంది. ఖర్చుల కోసం రూ.3 వేలు ఇస్తారు. పార్లమెంటరీ భత్యం రూ.45 వేలు ఉంటుంది. దినసరి భత్యం రూ.2 వేలు అందజేస్తారు. మొత్తంగా రూ.60 వేలు అందుతాయి.
సైదాబాద్ జయ నగర్ ప్రధాన రహదారిపై ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది. ఇన్నోవా కారు రోడ్డుపై వెళుతున్న నాలుగు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై వెళుతున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఇన్నోవా కారును మాత్రం అపకుండానే డ్రైవర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
పుణేలో నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇద్దరు ప్రాణాలకు పోయేందుకు కారణమైన మైనర్ కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఆ రోజు కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గంటల్లో బెయిల్ రావడం.. తిరిగి జువైనల్ హోంకు తరలించడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఆ బాలుడు ఆ రోజు కారు తాను నడపలేదని కొత్త భాష్యం చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేసింది ఫ్యామిలీ డ్రైవర్ అని వివరించారు.
పుణేలో ఓ మైనర్ కారు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతడిని అరెస్ట్ చేసిన తర్వాత స్టేషన్ తీసుకెళ్లి రాచ మర్యాదలు అందజేశారని తెలిసింది. మద్యం సేవించి, డ్రగ్స్ కూడా తీసుకున్న యువకుడికి స్టేషన్లో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
చాలా మంది వాహనదారులకు ఇంధన వాడకం విషయంలో పలు రకాల సందేహాలు ఉంటాయి. బైక్(bike) లేదా కారు(car)లో ఫుల్ ట్యాంక్ ఇంధనం(fuel) నింపుకుంటే మంచి మైలేజీ వస్తుందా లేదా లీటర్ నింపుకోవాలా అనే సందేహం ఉంటుంది. అయితే అసలు విషయమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.