Home » Budget 2024
Andhrapradesh: ఏపీ చరిత్రలో చాలా శుభదినమని ఎమ్యెల్యే సుజన చౌదరి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... అరాచక ఆటవిక పాలనలో రాష్ట్రం ఏమైందో చూశామన్నారు. అమరావతిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఇప్పుడు ఎన్డీఏ సర్కార్ భారీగా నిధులు కేటాయించిందని తెలిపారు. చట్టం ప్రకారం రావలసిన వాటినే తెచ్చుకోనే స్తోమత లేకుండా గత ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు.
దేశంలో స్టార్టప్లను ప్రోత్సహించి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తన బడ్జెట్(Budget 2024) ప్రసంగంలో కీలక విషయాలను ప్రకటించారు. ఈ క్రమంలో అన్ని రకాల పెట్టుబడిదారులకు ఏంజెల్ ట్యాక్స్(angel tax)ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
Andhrapradesh: కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించడం పట్ల మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... ఏపీ ఏం ఆశించిందో వాటిని కేంద్రం బడ్జెట్టులో పోందుపర్చడం సంతోషంగా ఉందన్నారు. అమరావతికి రూ. 15 వేల కోట్లు ఇవ్వడంతో రాజధాని పనులను పరుగులు పెట్టించవచ్చన్నారు.
Union Budget 2024: లోక్సభలో ఇంట్రస్టింగ్ సీన్ చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎన్డీయే కూటమి ఎంపీలను ప్రధాని మోదీ అభినందించారు. బడ్జెట్2024-25లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు చేయడంతో.. ఏపీ బీజేపీ, టీడీపీ ఎంపీలు ప్రధాని మోదీ వద్దకు వెళ్లి..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం శాసనసభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కూడా అమరావతినే రాజధాని ఉండే విధంగా..
కేంద్ర బడ్జెట్ 2024-25ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్కు సమర్పించారు. రికార్డు స్థాయిలో సీతారామన్ వరసగా ఏడవసారి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48.21 లక్షల కోట్లు బడ్జెట్ను ప్రకటించారు.
దేశంలో సాధారణ బడ్జెట్ 2024 సమర్పణ వేళ బంగారం(gold), వెండి(silver) ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలో ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు 250 రూపాయలు తగ్గి రూ. 67,600కి చేరగా, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,730కి చేరుకుంది.
Union Budget 2024: బడ్జెట్ 2024-25లో తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తమ పిల్లల భవిష్యత్పై చింత లేకుండా ఉండేందుకు సరికొత్త పథకం ప్రకటించింది. పిల్లవాడు NPS వాత్సల్య పేరుతో మైనర్ల కోసం జాతీయ పెన్షన్ పథకాన్ని ప్రకటించింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన(pmay) కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మూడు కోట్ల అదనపు ఇళ్లు నిర్మిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్ 2024(budget 2024) సందర్భంగా ప్రకటించారు. ఈ క్రమంలో పీఎం ఆవాస్ యోజనపై ప్రభుత్వం పెద్ద దృష్టి పెట్టిందని ఆర్థిక మంత్రి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రూ.15 వేల కోట్లు కేటాయింపుతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామంటూ బడ్జెట్ 2024-25 ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రానికి ఆర్థిక సహకారం అందిస్తామంటూ సీతారామన్ ప్రకటన చేశారు.