Home » BRS
కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం అవినీతికి పాల్పడిందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబంలో జరుగుతున్న గొడవలు ఆస్తికి సంబంధించినవేనని కడియం శ్రీహరి ఆరోపించారు.
మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్రెడ్డి సర్కార్ రాద్ధాంతం చేస్తోందని మాజీ మంత్రి హరీష్రావు ధ్వజమెత్తారు. ఏడాదిన్నర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. వానాకాలంలో విద్యుత్ డిమాండ్ ఉండదని హరీష్రావు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు. బోయిన్చెరువు కట్టమైసమ్మ ఆలయం నుంచి హస్మత్పేట డంప్ యార్డు వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణం పనులను కార్పొరేటర్ నర్సింహ యాదవ్తో కలిసి గురువారం ఎమ్మెల్యే పనులను ప్రారంభించారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావుపై మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలను మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్రెడ్డి ఖండించారు.
బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్రావు, ఐపీఎస్ అధికారి విశ్వజిత్ కంపాటి, సీఐ రవీందర్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ డిమాండ్ చేశాడు.
మాజీ ఎమ్మెల్సీ కవిత నేరెళ్ల కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి నేరెళ్ల బాధితుల కేసు తెరపైకి వచ్చింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్లోనే కేటీఆర్ ఉన్నారు. పలు కీలక విషయాలపై కేసీఆర్తో చర్చిస్తున్నారు.
ఉద్యమం అయినా, పాలన అయినా కేసీఆర్ వెన్నంటే ఉంటూ 25 సంవత్సరాలుగా నిస్వార్థంగా బీఆర్ఎస్ కోసం పని చేస్తున్న హరీశ్రావుపై కవిత వ్యాఖ్యలు చేయడం బాధాకరం అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, సంతోష్రావుపై కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. హరీశ్, సంతోష్ అవినీతి వల్లే కేసీఆర్కు సీబీఐ మరక అంటిందని చెప్పారు. కాళేశ్వరం అవినీతి డబ్బుతోనే హరీశ్రావు 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యేలకు సొమ్ములు ఇచ్చారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరోక్షంగా ఫైర్ అయ్యారు.