Home » BRS Chief KCR
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులు, తాము చేయమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. తెలంగాణా రాష్ట్రానికి 7 లక్షల కోట్లకు పైగా అప్పులున్నాయని చెప్పారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ ఈరోజు(శుక్రవారం) మీడియాతో మాట్లాడారు.
మాజీ సీఎం కేసీఆర్పై (KCR) టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం (Kodandaram) షాకింగ్ కామెంట్స్ చేశారు. మేడిగడ్డ డిజైన్ ఒకటైతే.. నిర్మాణం మరొక రకంగా చేయడంతో కుంగిపోయిందని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణ మెటిరీయల్ సక్రమంగా లేదు, నిర్వహణ కూడా లేదని డ్యాంసేప్టీ అధికారులు చెప్పారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ (BRS) బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి , డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. గూడెం మహిపాల్ రెడ్డీ పార్టీ మార్పుపై స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డే ఇల్లు ఇల్లు తిరిగి కండువాలు కప్పుతున్నారని ఎద్దేవా చేశారు.
పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి డుమ్మా కొట్టారు.
విద్యుత్తు ఒప్పందాలు, థర్మల్ ప్లాంట్ నిర్మాణాలపై మీరు లిఖితపూర్వకంగా పంపించిన వాదనలకు, వాటిని ఖండిస్తూ వివిధ వర్గాలు సమర్పించిన పత్రాలకు పొంతన లేదని, తమ ఎదుట హాజరై వాస్తవాలను వివరించాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి కమిషన్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు పవర్ కమిషన్ మంగళవారం మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు కమిషన్కు అందిన సమాచారంపై తమ అభిప్రాయం చెప్పాలని పవర్ కమిషన్ తన నోటీసుల్లో కేసీఆర్కు స్పష్టం చేసింది.
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) షాకింగ్ కామెంట్స్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్ బీఆర్ఎస్ బీ ఫామ్పై గెలిచి కాంగ్రెస్ లో చేరారని చెప్పారు.
తెలంగాణ ప్రాంతానికి ఉన్న ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి..ఈ సంస్థ తెలంగాణకు తలమానికమని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అన్నారు.
గత ప్రభుత్వంపై నిందలు వేయడానికి, మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై బురద జల్లాలన్న స్వార్థ రాజకీయంతో విచారణ కమిషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మాజీ మంత్రి , ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి (Jagadish Reddy) అన్నారు. ఈరోజు(మంగళవారం) తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్లో చోటు చేసుకున్న అవకతవకలపై కాళేశ్వరం కమిషన్ చైర్మన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ (Kaleswaram Commission Chairman Chief Justice Chandraghosh) విచారణలో వేగం పెంచారు. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులను విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.