Home » Botsa Satyanarayana
అమరావతి, జనవరి 13: సంక్రాంతి పర్వదినాన నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సంక్రాంతి తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేష్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇదే విషయాన్ని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. పండుగ తరువాత మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
Andhrapradesh: మెగా డీఎస్సీ కోరుతూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి డీవైఎఫ్ఐ యత్నించింది. బుధవారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి డీవైఎఫ్ఐ యత్నించగా.. పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డికి వ్యతిరేకంగా డీవైఎఫ్ఐ ప్రతినిధులు నినాదాలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ( Chandrababu ) రాష్ట్రంలో 175 స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు.. ఆ హక్కు ఆయనకు ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) వ్యాఖ్యానించారు.
విశాఖ సర్క్యూట్ హౌస్లో మంత్రి బొత్స సత్యనారాయణ ( Minister Botsa Satyanarayana ) తో సమగ్ర శిక్ష అభియాన్ ఉపాధ్యాయుల సంఘం సమావేశం అయింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు డిమాండ్లలో కొన్నింటిని ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కానీ కీలకమైన డిమాండ్ల స్థానంలో చేతులెత్తేసింది.. దీంతో ఉపాధ్యాయుల సంఘం చర్చలు విఫలం అయినట్లు సమాచారం.. సమ్మె కొనసాగుతుందని ఉపాధ్యాయులు ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ మేరకు అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది లేదని సర్కారు స్పష్టం చేయడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు.
మెడికల్ విద్యార్థులు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. క్లాస్ రూమ్లోనే రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. ఆ తర్వాత రోడ్డుపైనా దాడులకు దిగారు. రక్తం కారేలా కొట్టుకున్నారు.
మెడికల్ కాలేజీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి విడుదల చేసినా డీఎంఈతోనే సంప్రదింపులు జరుపుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో ఏపీఎంఎ్సఐడీసీ అధికారులు డీఎంఈతో సంబంధం లేకుండా నిర్ణయాలు
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణకు వైద్యులు విజయవంతంగా గుండె శస్త్ర చికిత్స చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ప్రభుత్వ ప్రాధాన్యాతాంశంలో విద్యా రంగం ప్రధానమైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చామన్నారు. ఇటీవల కాలంలో కొందరు విద్యా రంగంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ స్కూళ్లల్లో అందించే ఖరీదైన విద్యను పేదలకు అందిస్తుంటే బురద జల్లుతున్నారన్నారు.