Home » Bonda Umamaheswara Rao
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై గులకరాయి దాడి ఘటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమాను ఇరింకేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తున్నట్లు టీడీపీ వర్గాలకు సమాచారం అందింది. అయితే కావాలని టీడీపీ నేతలను ఇరికించేందకు యత్నిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు మండిపడితున్నాయి. ఈ క్రమంలో గులకరాయి ఘటనకు సంబంధించి బొండో ఉమా స్పష్టతనిచ్చారు. సీఎంపై రాయి దాడి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
సీఎం జగన్పై రాయి దాడి ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. నాలుగు రోజులైనా.. నిందితులెవరో పోలీసులు చెప్పకపోవడం.. విచారణ పేరుతో జాప్యం చేస్తుండటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగు తున్నట్లు తెలుస్తోంది. ఓ సీఎంపై రాయి విసిరిన వ్యక్తిని గుర్తించడానికి ఎందుకిత ఆలస్యం అవుతుందనేది మొదటి ప్రశ్న అయితే..
విజయవాడ: టీడీపీ నేత, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు బీసీ డిక్లరేషన్ వడ్డెర కోసం ‘ వడ్డెర్లకు అండ.. తెలుగుదేశం జెండా’ కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళ దాడి ఘటనను ఎలాగైనా టీడీపీ నేతల మెడకు చుట్టి తద్వారా లబ్ది పొందాలని అధికార పక్షం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి బోండా ఉమపై గురి పెట్టనున్నట్టు తెలుస్తోంది. బోండా ఉమను టార్గెట్ చేశారని టీడీపీ వర్గాలకు సమాచారం అందింది.
ఓటమి భయంతోనే ముఖ్యమంత్రి జగన్ గులకరాయి డ్రామా అడారని బోండా ఉమ అన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోడికత్తి తరహాలో గులక రాయి డ్రామాకు ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ సూత్రధారులు అని పేర్కొన్నారు.
తమపై నమోదైన కేసుల వివరాలు అందజేయాలని ఎన్నికల్లో పోటీ చేయబోతున్న పలువురు అభ్యర్థులు ఇచ్చిన వినతిపత్రాలపై డీజీపీ స్పందించకపోవడంపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది....
జిల్లాలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ వార్డ్ మెంబర్ భర్త దాడి చేశారు. ఈ దాడిలో టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు.టీడీపీ కార్యకర్తలు ఇంటిపై కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.
కొందరు ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు టీడీపీ - జనసేన - బీజేపీ నేతల ఫోన్లను ట్యాపింగ్(Phones Tapping) చేస్తున్నారని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమ (Bonda Uma) తీవ్ర ఆరోపణలు చేశారు. శనివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలుగుదేశం విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్టు ఆధారాలను బయట పెట్టారు.
గుజరాత్లో దొరికిన డ్రగ్స్ మూలాలు కూడా ఏపీలోనే దొరికాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు (Bonda Umamaheswara Rao) అన్నారు. శుక్రవారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎక్కడ మత్తు పదార్ధాలు దొరికినా దానికి ఏపీనే అడ్రస్గా ఉంటోందని చెప్పారు.
ఏపీ పోలీస్ ఉన్నతాధికారులు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారులు నరేందర్ రెడ్డి, రవీంద్రారెడ్డి, వేణుగోపాల్ రెడ్డిలు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఈసీ ఉన్నతాధికారుల ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.