Home » Bonalu Festival
బోనాలు సమర్పించేందుకు భక్తులు వందలాది మంది ఇక్కడకు తరలివస్తారు. గోల్కొండ ఆలయంలో తొమ్మిది రోజుల పాటు ఈ బోనాలు జరుగుతాయి.
భాగ్యనగరంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నెలరోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వేదమంత్రాలు, ఊరేగింపులు, శివసత్తులు, పోతరాజుల నృత్యాలతో ఆదివారం చారిత్రక గోల్కొండ శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాల వేడుకలకు శ్రీకారం చుట్టారు.
హైదరాబాద్: ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని భాగ్యనగరంలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ జగదాంబిక మహంకాళీ ఎల్లమ్మ బోనాలు గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్హౌజ్ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి.
హైదరాబాద్లో ఇక బోనాల సందడి! ఆషాఢమాసం తొలి ఆదివారమైన నేటి నుంచి ఆగస్టు 4వ తేదీ దాకా నెలరోజుల పాటు ప్రధాన ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగతాయి.
బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎస్ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు(SR Nagar Traffic Police) ప్రధాన రోడ్డును ఇరువైపులా మూసివేసి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు.
గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ బోనాల ఉత్సవాలను ప్రజలంతా శాంతియుతంగా జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి(Police Commissioner Srinivas Reddy) సూచించారు. గోల్కొండ బోనాల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తొట్టెల ఊరేగింపు ప్రాంతాన్ని పరిశీలించడంతో పాటు కోటలో బందోబస్తును పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్నారు.
భారతీయ సనాతన ధర్మం ప్రసాదించిన సర్వశక్తిమంతమైన అంశాలతో ‘శ్రీ లలితా విష్ణు’ అంశాలు ప్రధాన భూమికలుగా చేసుకుని ఈ ఏటి బోనాల పర్వాల వేళ ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించడానికి ముఖ్య అతిధి స్థానంలో విచ్చేసే ప్రభుత్వ, రాజకీయ, సినీరంగాల భక్తులకు ప్రముఖ రచయిత, శ్రీశైలదేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అమృతశక్తుల అపురూప రచనాసంకలనాన్ని ఉచితంగా సమర్పించడం మహంకాళి తల్లి అనుగ్రహ విశేషమేనని సికింద్రాబాద్ ఉజ్జయిని మహాహాకాళి దేవస్థానం ప్రధాన అర్చకులు రామతీర్థ శర్మ పేర్కొన్నారు.