Home » Bonalu Festival
ఈనెల 28వ తేదీన జరగనున్న ఆషాఢం బోనాల జాతర(Ashadham bonala fair)కు ఆలయాలు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ కమిటీలు ప్రత్యేక చొరవ తీసుకొని భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నారు.
మండలంలోని వేప కుంట గ్రామంలో మంగళవారం పోతలయ్యస్వామికి ఘనంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, యువకులు బోనాలు త్తుకుని వెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంత రం పోతలయ్యస్వామికి పూజలు చేసి, మొక్కులు తీర్చుకున్నారు.
పాడిపంటల్లో ఔషధాల వినియోగం తగ్గించండి.. అప్పుడే ఆరోగ్యం చక్కబడుతుంది. ఆయుష్షు పెరుగుతుంది.. అంటూ భవిష్యవాణి వినిపించిన స్వర్ణలత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఉజ్జయిని మహాకాళి(Ujjaini Mahakali) బోనాల జాతరలో సోమవారం రంగం నిర్వహించారు.
Telangana: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో రంగం కార్యక్రమంలో ఘనంగా జరిగింది. బోనాలు పండుగ తరవాతి రోజు జరిగే రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అమ్మవారి ఎదురుగా పచ్చి కుండపై నిలుచుని స్వర్ణలత భవిష్యవాణి పలికారు. అమ్మవారి ప్రతిరూపంలో మాతంగి స్వర్ణలత ఏ ఏ అంశాలు వ్యక్తపరుస్తుందనే ఆసక్తితో ఎదురు చూస్తున్న భక్తజనానికి అమ్మవారికి పలుకులు ఆనందాన్ని ఇచ్చాయి.
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. నెత్తిన బోనమెత్తి వచ్చిన ఆడబిడ్డలు, అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో లష్కర్ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి బోనాల పండగ ఘనంగా జరుగుతోంది. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని పట్టు వస్త్రాలు సమర్పించారు.
హైదరాబాద్: ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు బారులు తీరారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తలపై బోనంతో అమ్మవారి నామస్మరణ చేస్తూ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి భక్తులు తరలివస్తున్నారు.
తెలంగాణ ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే లష్కర్ బోనాలకు ఉజ్జయినీ మహాకాళి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. ఈనెల 21, 22 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహించే ఉత్సవాలకు ఉత్సవ కమిటీ, అధికార యంత్రాంగం ఏర్పాట్లను పూర్తిచేసింది.
సికింద్రాబాద్: ఉజ్జయని మహంకాళీ అమ్మవారి బోనాలు ఆదివారం తెల్లవారుజామున ధూమ్ దాంగా ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు వేకువజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. తెల్లవారుజామున అమ్మవారికి ప్రభుత్వం తరఫున హైదరాబాద్ ఇన్చార్జ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనాన్ని అమ్మవారికి సమర్పించారు.
ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర నేపథ్యంలో సికింద్రాబాద్(Secunderabad) పరిసర ప్రాంతాల్లో ఈనెల 21, 22 తేదీల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు.