Home » BJP
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కార్యాలయంలోకి బీజేపీ శ్రేణులు దూసుకెళ్లేందుకు యత్నించారు. ప్రతిగా బీజేపీ కార్యకర్తలపై బీఆర్ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన TVK అధినేత విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో గవర్నర్ ఆలస్యం చేస్తుండటాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పోరుబాట పడుతోంది. రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. విజయ్ నేతృత్వంలోని TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో గవర్నర్ కార్యాలయం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
కరీంనగర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కారును బీజేపీ నేతలు ధ్వంసం చేశారు.
భార్య పుస్తెలు అమ్మి పోటీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్కు కోట్ల రూపాయలు ఎక్కడివని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. బండి సంజయ్కు రేవంత్ రెడ్డి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.
పశ్చిమబెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని, ప్రధాని మోదీ తర్వాత టార్గెట్ తెలంగాణ రాష్ట్రమేనని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారని, తెలంగాణలో కూడా బీజేపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామంచందర్రావు ధీమా వ్యక్తం చేశారు.
అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో ‘అల్లూరి స్ఫూర్తి యాత్ర’ నిర్వహించారు. గురువారం ఉదయం విశాఖ బీచ్ రోడ్లో అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైక్లతో ర్యాలీని ప్రారంభించారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడిని గుర్తుతెలియని దుండగలు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
అస్సాం ముఖ్యమంత్రి పదవికి హిమంత బిశ్వ శర్మ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యకు అందజేశారు.