Home » Bihar
బిహార్ రెండో విడత ఎన్నికల్లో భాగంగా 122 స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 67.14 శాతం పోలింగ్ శాతం నమోదు అయింది.
తొలి విడత పోలింగ్ ఈనెల 6న జరుగగా, భారీ ఎత్తున పోలింగ్ నమోదైంది. రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కావడంతో రెండో విడత కూడా ఆదే రకంగా ఉంటే ప్రజలు మార్పును కోరుకునే అవకాశాలు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.
మధ్యాహ్నం వరకూ జరిగిన పోలింగ్లో కిషన్గంజ్ జిల్లాలో అత్యధికంగా 51.86 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో గయ 50.95 శాతం ఓటింగ్తో ముందంజలో ఉంది. జముయిలో 50.91 శాతం, బంకాలో 50.07 శాతం పోలింగ్ నమోదైంది.
ఈసారి పోలింగ్ జరుగుతున్న పలు నియోజకవర్గాల్లో కూటమి భాగస్వామ్య పార్టీల నేతలే ప్రత్యర్థులుగా తలపడుతుండటం ఆసక్తిని కలిగిస్తోంది. కొన్ని చోట్ల టిక్కెట్లు నిరాకరించడంతో రెబల్ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు.
నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.
జన్సురాజ్ నిర్మాణానికి తాము ఎంతో కష్టపడ్డామని, మార్పు ఇప్పటికే కనిపిస్తోందని, ఫలితాల కోసం వేచిచూద్దామని ప్రశాంత్ కిషోర్ అన్నారు. బిహార్ ప్రజలు ఇప్పటికీ మార్పును కోరుకోకుంటే వారితోనే ఉంటూ మరో ఐదేళ్లు పని చేస్తూ వెళ్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ, ప్రభుత్వంలో చేరే ప్రసక్తే లేదన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ గత మేలో ఒక మహిళతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ఫేస్బుక్ పోస్టులో వెల్లడించడంతో ఆర్జేడీలో కలకలం రేగింది. దీంతో ఆయనను పార్టీ నుంచి ఆర్జేడీ బహిష్కరించింది.
సరైరంజన్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధి డిస్పాచ్ సెంటర్ సమీపంలో కొన్ని వీవీప్యాట్ స్లిప్పులు కనిపించాయని, అధికారులతో కలిసి తాము అక్కడికి వెళ్లామని డీఎం కుష్వాహ తెలిపారు. అభ్యర్థుల సమక్షంలో ఆ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు.
సీతామర్హిలో శనివారం నాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, ఒకానొక సమయంలో బిహార్ ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి చేపలను సేకరించేదని, కానీ మత్స్యశాఖకు సంబంధించి తాము తీసుకున్న చర్యల కారణంగా బిహార్ ఇప్పుడు చేపల పెంపకంలో స్యయం సమృద్ధిని సాధించిందని చెప్పారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలవడం, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ఎల్ఈడీ వెలుగుల్లో మెరిసిపోవడం ఖాయమని యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు.