Home » Bihar Elections 2025
ఎన్నికల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చినా, ఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినా నితీశ్ మాత్రం సీఎంగానే కొనసాగుతున్నారు. అయితే ఈసారి నితీశ్ పార్టీ గెలుపు కష్టమని చాలా మంది అంచనా వేశారు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఎన్డీఏ కూటమికి భారీ విజయాన్ని అందిస్తున్న బిహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఉద్ఘాటించారు.
బీహార్లో ఏన్డీయే విజయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందుగానే ఊహించారు. ఎన్డీటీవీ బీహార్ పవర్ ప్లే సమ్మిట్లో అమిత్ షా.. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే సాధించబోయే సీట్ల గురించి ముందుగానే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే బీహార్లో ఎన్డీయే కూటమి దూసుకెళ్తోంది
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కూటమి మహాగఠ్ బంధన్ కు ఊహించని షాకిస్తున్నాయి. ఆ కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకంజలో ఉన్నారు.
బిహార్ ఎన్నికల ఫలితాలపై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీపై నమ్మకం ఉంచి, ఎన్డీఏకు పట్టం కడుతున్న బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే దూసుకెళ్తోంది. ప్రభుత్వ ఏర్పాటు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 122ను దాటి 160కి పైగా స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ను రేపు నిర్వహించనున్నారు. ఎన్డీయే, మహాగఠ్బంధన్లల్లో విజయం ఎవరిని వరిస్తుందో రేపు తేలిపోతుంది. ఈసారి రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిన నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠ పతాకస్థాయికి చేరుకుంది. ఎన్డీయే కూటమిదే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే అంచనా వేశాయి.
ఎగ్జిట్ పోల్స్ బిహార్ బీజేపీ శ్రేణులను సంబరంలో ముంచెత్తుతోంది. పోల్ డే రోజు పెద్ద ఎత్తున లడ్డూలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మెజారిటీ ఎగ్జిట్ ఫోల్స్ బిహార్లో తిరిగి ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేశాయి. మహాగఠ్బంధన్కు గతంలో వచ్చిన సీట్లు కూడా రావని పేర్కొన్నాయి.
ఈసారి ఆర్జేడీ, కాంగ్రెస్ గెలిచే సీట్లు తగ్గవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఆ ప్రకారం చూసినప్పుడు గత ఎన్నికల్లో మహాగఠ్బంధన్లోని ఆర్జేడీ, కాంగ్రెస్ సాధించిన సీట్లు ఈసారి తగ్గే అవకాశం ఉంది.