Home » Bhatti Vikramarka
ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.
కశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఖండించారు. 27 మంది హత్య చేయడం అమానుషం అని, ఇటువంటి ఘటనలకు దేశంలో తావు లేదన్నారు.
రాష్ట్రాల మధ్య ఇంధన రంగంలో సహకారం కీలకమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ-రాజస్థాన్ మధ్య 3100 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందం విజయవంతంగా జరిగింది.
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్ట్..సెకండ్ ఈయర్ ఫలితాలను రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
ప్రజా గాయకుడు గద్దర్ తెలంగాణా సంస్కృతి భావాజాలాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారని, ఒక శతాబ్దానికి ఓ మనిషి అలాంటివారు పుడతారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావానికి గద్దర్ తన పాటలతో కృషి చేశారని కొనియాడారు. అలాంటి వ్యక్తి పేరు మీద అవార్డులు ఇస్తున్నామని ఆయన అన్నారు.
రంగారెడ్డి జిల్లా పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో మొదటి దశలో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు గడిచినా తమ సమస్యల పరిష్కారం కోసం కృషి జరగలేదని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు భట్టి విక్రమార్కకు తెలిపారు.
ఖమ్మం జిల్లా వైరాలోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆదివారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆకస్మికంగా తనిఖీ చేశారు.
కంచ గచ్చిబౌలి భూముల విషయంలో కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఏస్ , రెవెన్యూ , జీహెచ్ఎంసీ, అటవీ , హెచ్ఎండీఏ ఇతర ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి సమావేశంకానున్నారు. ఒకటి రెండు రోజుల్లో విద్యార్థి సంఘాలు, పౌర సంఘాలు, పర్యావరణ వేత్తలతో మంత్రుల కమిటీ సమావేశం కానుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిలో ఒక అంగుళం కూడా తెలంగాణ ప్రభుత్వం స్వాధీన పరుచుకోలేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. బీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు చెప్పి విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.