Home » Bhatti Vikramarka
Telangana: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 76 సంవత్సరాల క్రితం ఇదే రోజున మన తెలంగాణ, నాటి హైదరాబాద్ సంస్థానం రాజుల పాలన నుంచి భారతదేశంలో అంతర్భాగంగా మారి ప్రజాస్వామ్య ప్రజాపాలన దశలోకి పరివర్తన చెందిందని తెలిపారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ అగ్ర నాయకుడు తన్నీరు హరీ్షరావు సోమవారం బహిరంగ లేఖ రాశారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. ‘‘మీ 9నెలల పాలనలో విద్యావ్యవస్థ పతనానికి చేరుకొంది. సంక్షేమ హాస్టళ్ల పరిస్థితి దుర్భరంగా మారింది.
తెలంగాణలో 2035 నాటికి అదనంగా 40వేల మెగావాట్ల(40గిగావాట్లు) గ్రీన్ పవర్(సౌర, పవన, జల విద్యుత్)ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
టీసీపీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మహేశ్ కుమార్ గౌడ్కు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులున్నా.. పార్టీని అధికారంలోకి తెచ్చారని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్తు (గ్రీన్ ఎనర్జీ)ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు వెంటనే ప్రణాళికలను సిద్ధ చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్లు, సర్చార్జీల వల్ల రాష్ట్రాల పన్నుల వాటా నిధుల్లో కోత పడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం శివారులోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎ్స)లో 2025 మార్చి చివరి నాటికి పూర్తిస్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
రాష్ట్రంలో ప్రతి పేద విద్యార్థికీ కార్పొరేట్ స్థాయిలో అత్యున్నత విద్యను అందించాలన్నదే ప్రజాప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ యూనిట్-2 ఆయిల్ సింక్రనైజేషన్ పనులు ప్రారంభించిన అధికారులు, సిబ్బంది, కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అభినందనలు తెలిపారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయలేకపోవడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమే కారణమని భట్టి అన్నారు.
సీనియర్ సిటిజన్లకు ఆరోగ్య బీమా ప్రీమియంపై జీఎస్టీని పూర్తిగా మినహాయించాలని, మిగతా వారికి 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క జీఎస్టీ మండలికి సూచించారు.