Home » Bharath
రాష్ట్రపతి భవనంలో నిర్వహించనున్న జీ20 విందు ఆహ్వానాలపై ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ ముద్రించడంతో.. దేశవ్యాప్తంగా దేశం పేరు మార్పుపై తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. దేశం పేరుని ‘భారత్’గా మారుస్తారా?...
రాష్ట్రపతి భవన్లో నిర్వహించనున్న జి20 సమ్మిట్ విందు ఆహ్వానంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కి బదులు ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని పేర్కొనడం.. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దేశం పేరుని..
జీ20 సదస్సుకు హాజరయ్యే విదేశీ నేతలను విందుకు ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రాల్లో రాష్ట్రపతిని ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని సంబోధించడంతో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరుగుతోంది.
భారత్-చైనా సంబంధాలు మొత్తం మీద నిలకడగా ఉన్నాయని చైనా తెలిపింది. జీ20 సదస్సుకు తమ దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్ హాజరు కాకపోయినప్పటికీ, అది విజయవంతమయ్యేందుకు అన్ని పక్షాలతోనూ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ (Sonia Gadhi) బుధవారం ఓ లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల ఎజెండాను వెల్లడించాలని కోరారు.
మన దేశం పేరును ‘ఇండియా’కు బదులుగా భారత్ అని పిలిచే చర్యలు చంద్రయాన్-3 విజయవంతమవడానికి ముందే ప్రారంభమయ్యాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా, గ్రీస్ దేశాల్లో పర్యటించేందుకు వెళ్లినపుడే ‘ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భారత్’ అని రాశారు.
మన దేశం పేరును ‘భారత్’గా పునరుద్ధరించబోతున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ‘ఇండియా’ పేరుపై హక్కును పాకిస్థాన్ కోరుతుందా? అనే అంశం తెరపైకి వచ్చింది.
మోదీ ప్రభుత్వం దేశం పేరును మార్చబోతోందా? ‘ఇండియా’ స్థానంలో ‘భారత్’ అని తీసుకురానుందా..? విపక్షాల ‘ఇండియా’ కూటమికి భయపడే ఇలా పేరు మార్చుతోందా..? తాజా పరిణామాలు అవుననే సూచిస్తున్నాయి. జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈ నెల 9న ఇచ్చే విందుకు రమ్మంటూ ఆయా దేశాల అధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట పంపిన ఆహ్వాన పత్రంలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’కు
నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం (Central Govt) త్వరలో దేశం పేరు మార్చబోతుందన్న వార్త ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్గా మారింది. మన దేశం పేరును ‘ఇండియా’ (India) అని కాకుండా జీ20 సమ్మిట్ ఆహ్వాన పత్రికలో ‘భారత్’ (Bharat) అని పేర్కొనడం ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశం అవుతోంది...
దేశంలోని ప్రజలందరి దగ్గర ఏదో ఒక గుర్తింపు కార్డు ఉంది. ఆయా కార్డులన్నింటిపైనా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనే ఉంటుంది. ఇప్పుడు దేశం పేరు మారిస్తే గవర్నమెంట్ ఆఫ్ భారత్ అని కార్డులపై ఉండాలి. లేకపోతే గుర్తింపు కార్డులు చెల్లే అవకాశాలు ఉండవు. దీంతో ప్రజలు మరోసారి ప్రభుత్వ కార్యాలయాల ముందు బారులు తీరి వాటిని మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.