Home » Bhadradri Temple
భద్రాద్రి సీతారాముల కల్యాణం తిలకించేందుకు లక్షలాది భక్తులు దక్షిణ అయోధ్య బాట పట్టారు. శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో సీతారాముల కల్యాణం.. అంగరంగ వైభవంగా జరగింది. ఇందుకోసం మిధిలా స్టేడియం అందంగా ముస్తాబైంది. సీఎం రేవంత్ రెడ్డి దంపతులు స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
భద్రాచల పుణ్య క్షేత్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళాశోభితమైన కల్యాణమండపంలో ఉదయం 10.30 గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది.
శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం ముస్తాబైంది. నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీతారాముల వారి కల్యాణంలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.
భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట జాతీయ రహదారి శ్రీరామనామ స్మరణతో మార్మోగుతోంది. రాజమండ్రి జగ్గారెడ్డి గూడెం ప్రాంతాల నుంచి వేలాదిమంది రామ భక్తులు సీతారాముల కల్యాణానికి గోటి తలంబ్రాలతో పాదయాత్రగా గురువారం నాడు భద్రాచలం బయలు దేరారు.
Bhadrachalam Temple: దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలం టెంపుల్ సిటీగా మారనుంది. కేసీఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన భద్రాచలం రామాలయం అభివృద్ధికి రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వసంత పక్ష ప్రయుక్త శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా గురువారం గరుడ ధ్వజ పట లేఖనం కార్యక్రమం జరగనుంది. అర్చకులు ఈ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.
భద్రాచలం దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ, నిధులకు సంబంధించి పూర్తి వివరాలను ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు.
Bhadradri Ramayya: టీజీఎస్ఆర్టీసీ భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది. భద్రాచల రామయ్య పెళ్లి తలంబ్రాలు ఇక నుంచి నేరుగా భక్తులకు డోర్ డెలివరీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందుకోసం మీరు ఏం చేయాలంటే..
భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పరిధిలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో చేపట్టిన షెడ్ల నిర్మాణం శ్రీరామనవమి నాటికి పూర్తి చేయలేమని సంబంధిత కాంట్రాక్టర్లు కలెక్టరుకు నివేదించినట్లు సమాచారం.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం భద్రాద్రి దేవస్థానం ప్రత్యేక యాప్ను రూపొందించింది. రామయ్య పెండ్లి పనులు ప్రారంభం కావడం, సీతమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో శుక్రవారం ఈ యాప్ను దేవస్థానం ఈవో ఎల్.రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు.