Home » Bhadradri Kothagudem
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్(బీటీపీఎ్స)లో శనివారం రాత్రి సంభవించిన అగ్ని ప్రమాదానికి పిడుగుపాటే కారణమని అధికారులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్-3 (320, 420/16.5 కేవీ) పూర్తిగా కాలిపోయింది.
భద్రాద్రి పవర్ ప్లాంట్ ఒకటో యూనిట్పై పిడుగు పడింది. పిడుగు పాటుకు 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి షట్ డౌన్ అయింది. జనరేషన్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగినట్లు ప్లాంట్ అధికారులు చెబుతున్నారు.
కంచుమేళం (డోలి) కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) ఆదివారం ఉదయం ఆనారోగ్యంతో మృతిచెందారు. అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసిన ఆయన 2022 జనవరి 25న రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు.
తెలంగాణ భరించలేనంత స్థాయికి భద్రాద్రి పవర్ ప్లాంట్ భారం చేరిందని, ఛత్తీ్సగఢ్తో చేసుకున్న విద్యుత్ ఒప్పందం రాష్ట్రానికి శిరోభారంగా మారిందని విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్, తిమ్మారెడ్డి పేర్కొన్నారు. విద్యుత్పై విచారణ చేస్తున్న కమిషన్కు వారు ఇప్పటికే ఫిర్యాదు చేశారు.
విద్యుత్తు కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి పవర్ప్లాంట్లపై వివరణ ఇస్తూ మాజీ సీఎం కేసీఆర్ పంపిన లేఖ తమకు అందిందని విద్యుత్తు ఒప్పందాలపై విచారణ జరుపుతున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి తెలిపారు.
నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రాన్ని తొలకరి పలకరించింది. పలు జిల్లాల్లో బుధవారం వర్షాలు కురిశాయి. సాయంత్రం వేళ గంటన్నర పాటు కుండపోత వానతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులను వరద ముంచెత్తింది. బేగంబజార్లో అత్యధికంగా 8.8, బండ్లగూడలో 8.1, సర్దార్ మహల్లో 8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం పడింది.
మహబూబాబాద్ ఎడ్యుకేషన్, పెనుబల్లి, జూన్ 3: తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. మే 24ననిర్వహించిన పాలిసెట్ ఫలితాలను సోమవారం విద్యా శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఇందులో 84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ రియల్ వ్యాపారం జోరు తగ్గలేదు. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా రిజిస్ట్రేషన్లు, స్టాంపుల విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచే అత్యధిక ఆదాయం సమకూరింది. ఈ జిల్లాల్లో డాక్యుమెంట్ల నమోదు కూడా ఎక్కువగానే ఉంటుంది.
కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మరోసారి సందడి చేశారు. కేసులతో బిజీగా ఉన్న ఆయన రిలాక్స్గా తెలుగు పాటలకు మాస్ స్టెప్లేసి ఆదరగొట్టారు. ఎస్పీ డ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
బూటకపు ఎన్కౌంటర్లను హెచ్చరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మావోలు శుక్రవారం లేఖ రాశారు. అల్లూరి డివిజన్ కమిటీ పేరుతో మావోయిస్ట్ పార్టీ శుక్రవారం లేఖ విడుదల చేసింది. భారత విప్లవోద్యమం నిర్మూలన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న విప్లవ ప్రతిఘాతుక దాడిని ఓడిద్దామని పిలుపునిచ్చారు. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను దొరక బట్టి చంపుతున్నారని.. బూటకపు ఎన్కౌంటర్లను నిజమైన ఎన్కౌంటర్లగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు.