Home » Bhadradri Kothagudem
కృష్ణా పరిధిలో ఎగువన వర్షాలు, వరదలతో నది పరిధిలోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది.
రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సికిల్ సెల్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. సికిల్సెల్ ఎక్కువగా గిరిజన, మలేరియా కేసులు ఎక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లోనే ఉంటుంది.
భద్రాద్రి కొత్తగూడెం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి పరవళ్ళు తొక్కుతోంది. మూడో ప్రమాద హెచ్చరిక దిశగా గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. 51.10 అడుగుల వద్ద 13,18,860 క్యూసెక్కుల వరద ఉధృతి పెరిగింది. 53 అడుగులు దాటగానే మూడో ప్రమాద హెచ్చరిక జారీ కానుంది.
తెలంగాణ, ఏపీ పరిధిలో 16 వేల ఎకరాల ఆయుకట్టు కలిగిన పెదవాగు ప్రాజెక్టుకు తక్షణ మరమ్మతులు చేసి ఈ సీజన్లోనే రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు తగిన ప్రణాళిక రూపొందిస్తున్నట్టు రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం: పెద్దవాగు ఘటన చాలా బాధాకరమని, ప్రాజెక్ట్ ఆనకట్ట తెగిన సమాచారం తెలియగానే ఎంతో తల్లడిల్లిపోయానని, హెలి కాఫ్టర్ ఆలస్యం అయితే ఏమైనా ప్రాణ నష్టం వాటిల్లిందని ఎంతో మదన పడ్డానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెదవాగు ప్రాజెక్టుకు గండ్లు పడి... నీరంతా దిగువ ప్రాంతాలను ముంచెత్తడంపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్సఏ) స్పందించింది. ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని (స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ను) ఆదేశించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెదవాగు ఖాళీ అయింది. గురువారం రాత్రి కట్ట పక్కనే పడిన గండి అర్ధరాత్రి తర్వాత క్రమంగా పెద్దదైంది. సుమారు 35 అడుగుల లోతులో ఉన్న నీరంతా దిగువకు పోయింది.
భద్రాద్రి జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు రైతు బోజడ్ల ప్రభాకర్ ఆత్మహత్యకు పురిగొల్పినవారిని ఉపేక్షించేది లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ప్రభాకర్ ఆత్మహత్య బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీలో విలీనమైన గ్రామాలను తిరిగి భద్రాచలం (Bhadrachalam)లో కలపాలని స్థానిక నేతలు, ప్రజలు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageswara Rao)ను కోరారు. ఈ మేరకు భద్రాచలం విలీన గ్రామాల నేతలు హైదరాబాద్లోని మంత్రి నివాసంలో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Telangana: మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. అప్పటి వరకు తమముందు ఎంతో ఆనందంగా ఉన్న వారు హఠాత్తుగా మరణిస్తుంటారు. అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. ఎంతో శ్రద్ధగా చదువుకుంటున్న ఓ చిన్నారి.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది.