Home » Bellampalli
డంపింగ్యార్డు సమస్యను త్వర లోనే పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అన్నారు. మం గళవారం ఆర్డీవో హరికృష్ణతో కలిసి పెద్దనపల్లిలోని డంపింగ్యార్డు కోసం స్థలాన్ని పరిశీలించారు. వారు మాట్లాడుతూ కొన్ని నెలలుగా పట్టణంలో డంపింగ్ యార్డు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నార న్నారు.
గణేష్ నిమజ్జనానికి పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశామని మున్సిపల్ చైర్ప ర్సన్ జక్కుల శ్వేత పేర్కొన్నారు. మంగళవారం నిమజ్జనం కోసం బెల్లంపల్లి పోచమ్మ చెరువు వద్ద ఏర్పాట్లను ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ రవికుమార్లతో కలిసి పరిశీలించారు. వారు మాట్లాడుతూ చెరువు లో నిమజ్జనం కోసం పూడికతీత చేపట్టామన్నారు.
బెల్లంపల్లి పట్టణ ప్రజలకు తాగునీటి కోసం గోదావరి నీటిని అందిస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. సోమవారం ఎల్లంపల్లి, బెల్లంపల్లిలోని తాగునీరు సరఫరా చేసే పంప్ హౌజ్లను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అమృత్ పథకంలో భాగంగా రూ.61 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లం పల్లికి గోదావరి నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొ న్నారు.
ప్రాణహిత నది బ్యాక్ వాటర్తో మండలం లో పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. ఆదివారం సుంపుటం, వేమనపల్లి, ముల్కలపేట, రాచర్ల గ్రామాల్లో ప్రాణహిత నది బ్యాక్ వాటర్తో నష్టపోయిన పత్తి పంటలను పరిశీలిం చారు.
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటు లో ఉంటూ అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్వో హరీష్రాజ్ సూచించారు. మంగళవారం తాళ్లగురిజాల పీహెచ్సీని సందర్శించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను, రికార్డులు, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ వైద్యు లు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మలేరియా, డెంగ్యూ, చికున్ గున్యా లాంటి వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
పొలాల అమావాస్య రోజున ఉపవాస దీక్షలు చేసి తర్వాత రోజు బడగ పండగను నిర్వహిం చడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. బడగ పండగను పురస్కరించుకుని ఇండ్లలో పిండి వంటలు చేసుకుని బంక మట్టితో ఎడ్లను తయారు చేసి పూజ లు చేసి నైవేద్యాలు సమర్పించి దీక్షలను పూర్తి చేశా రు. అనంతరం మట్టి ఎడ్లను గంపలలో డప్పుచప్పు ళ్లతో వెళ్లి స్ధానిక చెరువులో నిమజ్జనం చేశారు.
అన్ని గ్రామా ల్లో ఫీవర్ సర్వే నిర్వహించి జ్వర పీడి తులను గుర్తించాలని డిప్యూటీ డీఎంహెచ్వో సుధాకర్ నాయక్ సూ చించారు. సోమవారం కాసిపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి రికార్డులు, రిజి ష్టర్లను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చేవారికి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో కొన్ని నెలలుగా ఇసుక కొరత ఏర్పడింది. దీంతో ఇండ్ల నిర్మాణాలు నిలిచిపోవడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇసుక దొరకక ఎక్కడ చూసినా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండ్ల నిర్మాణాలు అగుపిస్తున్నాయి. ఇసుక లేక ఇంటి నిర్మాణాలు ఆగిపోవడంతో కూలీలకు ఉపాధి దొరకడం లేదు.
ప్రభుత్వం వెంటనే కాంట్రీ బ్యూటరీ పింఛన్ స్కీంను రద్దు చేసి పాత పింఛ న్ను పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపా ధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు సయింపు శ్రీని వాసరావు పేర్కొన్నారు. శనివారం పింఛన్ విద్రోహ దినం సందర్భంగా దేవులవాడ ఉన్నత పాఠశాలలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.
తాగునీటి సమస్య పరి ష్కరించాలని కౌన్సిలర్లు కలెక్టర్ కుమార్ దీపక్కు విన్నవించారు. శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన సర్వసభ్య సమావేశం వాడివేడీగా సాగింది. సమావేశానికి కలెక్టర్ కుమా ర్ దీపక్ హాజరయ్యారు.