• Home » Bellampalli

Bellampalli

నిత్యావసర ధరలు తగ్గించాలి

నిత్యావసర ధరలు తగ్గించాలి

నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాలని శనివారం సీపీఐ పట్టణ సమితి నాయకులు కాంటా చౌరస్తా వద్ద రహదారిపై ధర్నా నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు వెంకటస్వామి, పట్టణ కార్యదర్శి ఆవిడపు రాజమౌళిలు మాట్లాడుతూ ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లితోపాటు నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.

 అటవీ శాఖలో సిబ్బంది కొరత

అటవీ శాఖలో సిబ్బంది కొరత

అటవీ శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. కింది స్థాయి ఉద్యోగులు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు కీలక పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. దీంతో అటవీ సంపదకు రక్షణ కరువైంది. అక్ర మార్కుల గొడ్డలి వేటుకు విలువైన అటవీ సంపద తరిగి పోతుంది. దీంతోపాటు వేటగాళ్లు వన్యప్రాణులను హత మారుస్తున్నారు.

ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ

ఇష్టారీతిన హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వహణ

జిల్లాలోని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, దాబాల్లో అపరిశుభ్రత నెలకొంటుంది. రోజుల తరబడి నిల్వ చేసిన ఆహార పదార్ధాలతో వంటకాలు తయారు చేస్తు న్నారు. కుళ్లిన కూరగాయలు, మాంసం, నాణ్యత లేని పదార్ధాలు, కాలం చెల్లిన మసాలాలు వినియోగిస్తున్నారు.

జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి

గిరిజన గ్రామాల్లో జ్వరాలు ప్రబలకుండా నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేప ట్టాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం కాసిపేట పీహెచ్‌సీని సందర్శించి వైద్యులు, రోగులకు అం దిస్తున్న సేవలను తెలుసుకున్నారు. జ్వరపీడిత గ్రామాల ను గుర్తించి వైద్య శిబిరాలను నిర్వహించాలని సూచిం చారు.

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

నిరంతరం అప్రమత్తంగా ఉండాలి

నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజల రక్షణ కోసం పాటుపడాలని రామగుండం సీపీ శ్రీని వాస్‌ సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి

రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలి

కుమరంభీం ఆసి ఫాబాద్‌ జిల్లా జైనూరు మండలానికి చెందిన మహి ళపై అత్యాచారయత్నం, దాడికి పాల్పడిన నిందితుడి పై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్ర బంద్‌కు పిలుపు నిచ్చినట్లు ఆదివాసీ నాయకపోడ్‌ సేవా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల బాపు తెలిపారు.

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం ఎల్‌పీజీ సబ్సిడీ పత్రాల పంపిణీలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అ ర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామన్నారు.

పాముకాటుతో ఒకరి మృతి

పాముకాటుతో ఒకరి మృతి

దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీలో పాముకాటుతో సెక్యూరిటీ గార్డు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి విధులు ముగించుకొని ఆరుగురు సెక్యూరిటీ గార్డులు బ్యారక్‌కు చేరుకొని నిద్రలోకి జారు కున్నారు.

mancherial  పురుగుల అన్నం.. నీళ్ల పప్పు...

mancherial పురుగుల అన్నం.. నీళ్ల పప్పు...

విద్యార్థులకు పురుగుల అన్నం... నీళ్ల పప్పు వడ్డించడంపై బెల్లంపల్లి జూని యర్‌ సివిల్‌ జడ్జి ముఖేష్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని కేజీ బీవీ పాఠశాలతోపాటు ఆదర్శ మోడల్‌ కళాశాల హాస్ట ల్‌ను పరిశీలించారు. మోడల్‌ కళాశాలలో పురుగుల అన్నంతోపాటు నీళ్ల పప్పు వడ్డించడాన్ని చూసి ఆగ్ర హం వ్యక్తం చేశారు.

 ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన న్యాయాధికారి

ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన న్యాయాధికారి

మండల కేంద్రంలోని కస్తూర్బా ఆశ్రమ పాఠ శాలను బెల్లంపల్లి జూనియర్‌ సివిల్‌ జడ్జి ముకేష్‌ గురువారం రాత్రి తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలు, సిలబస్‌ అంశాలను తెలుసుకున్నారు. సమస్యలను తెలిపితే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని జడ్జి పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి