Home » Bellampalli
పట్టణంలోని ప్రాణహిత కాలనీ సమీ పంలో గల లెదర్ పార్కు మధ్యలో నుంచి వేసి న రోడ్డును నిలిపివేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సింగరేణి అధికారులను ఆదేశించారు. బుధవారం లెదర్ పార్కును సంద ర్శించారు.
ఎన్నికల సమయంలో గడ్డం వినోద్ అబద్దపు హామీలు ఇచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలను మోసం చేశాడని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధ వారం 2వ వార్డులో 200 మందికి పైగా బీఆర్ఎస్ పార్టీలో చేరగా మాజీ ఎమ్మెల్యే కండువాలు కప్పి ఆహ్వానించారు.
మంచిర్యాల ఫారెస్టు డివిజన్ పరిధిలోకి పెద్దపులి వచ్చింది. ఆదివారం సాయంత్రం ముత్యంపల్లి సెక్షన్ మామిడిగూడలోని గోండుగూడకు చెందిన గిరిజన రైతు చిత్రు ఆవుల మందపై దాడి చేసి మూడు ఆవులను చంపింది. దీంతో పెద్దపులి వచ్చిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి ఎస్ 12 మగ పులిగా అధికారులు భావిస్తున్నారు.
ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తామని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. శుక్రవారం బెల్లంపల్లి క్యాంపు కార్యాయలంలో కాసిపేట మండలానికి చెందిన 17 దండారీ గ్రూపులకు ఒక్కో గ్రూపుకు రూ. 15 వేల చెక్కులను అందజేసి మాట్లాడారు.
అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని మహిళలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మహిళల ఉన్నతితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందన్నారు. మండల కేంద్రంలో స్వయం సహాయ సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల విక్రయ కేంద్రం, పిండి వంటలు, పచ్చళ్ల తయారీ కేంద్రం, మెడికల్ స్టోర్ను కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
మతం ఏదైనా మానవత్వాన్ని పెంపొందించి అన్ని మతాలను సమానంగా గౌరవించినప్పుడే ప్రపంచ శాంతి నెలకొంటుందని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం కల్వరి చర్చి నిర్వాహకులు ప్రవీణ్కుమార్-షారోన్ నిర్వహించిన 50 రోజుల ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా మాట్లాడారు.
బతుకమ్మ చీరల పంపిణీ ఆం దోళనలు, నిరసనల మధ్య గురువారం నిలిచిపోయింది. మండలానికి 10770 చీరలు బుధవారం వచ్చాయి. వీటిని ఇందిరాక్రాంతి పథం సభ్యులకు అప్ప గించారు. స్వయం సహాయక సంఘంలోని సభ్యులకు మాత్రమే చీరలు అం దజేయాలని తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. వేమనపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆసుపత్రి పరిసరాలను, వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్య సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, మందులను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
సీపీఐ నేత, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ సేవలు మరువలేనివని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం గుండ మల్లేష్ వర్ధంతిని నిర్వహించారు. గుండా మల్లేష్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి ప్రజల సంక్షేమానికి కృషి చేశారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో నాలుగేండ్ల క్రితం బెల్లంపల్లికి ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒకే ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ మంజూరు కావడం, బెల్లంపల్లికి కేటాయించడంతో స్ధానికులు, జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.