Home » Bangladesh
షేక్ హాసీనాతోపాటు అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ ఖాదర్పై బంగ్లాదేశ్ పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఆగస్ట్ 4వ తేదీ.. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేయాలంటూ విద్యార్థులు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. వారికి మద్దతుగా టీచర్ హుస్సేన్ ఆ ఆందోళనలో పాల్గొన్నారు.
బంగ్లాదేశ్లో మైనారిటీలు, హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. హిందువులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బంగ్లాదేశ్(Bangladesh Crisis) స్వాతంత్ర్య పోరాట వారసులకు అత్యధిక రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రారంభమైన అల్లర్లు.. చివరికి ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేశాయి.
బంగ్లాదేశ్(Bangladesh)లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 15న జాతీయ సెలవుదినాన్ని(public holiday) రద్దు చేశారు. ఈ రోజున బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బహిష్కరించబడిన ప్రధాన మంత్రి షేక్ హసీనా తండ్రి బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ హత్యకు గురయ్యారు.
బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువులకు, సైన్యానికి మధ్య మంగళవారంనాడు స్వల్ప ఘర్షణ తలెత్తింది. రిజర్వేషన్ల అంశంపై ఇటీవల తలెత్తిన ఆందోళనల పర్యవసానంగా షేక్ హసీనా ఇటీవల ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం, మధ్యంతర ప్రభుత్వం అధికారంలోకి రావడం, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల్లో మైనారిటీ హిందువులపై దాడులు చోటుచేసుకున్నాయి.
బంగ్లాదేశ్లో హిందువులతో సహా మైనారిటీలపై దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఆదేశ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ముహమ్మద్ యూనుస్ ఢాకాలోని ప్రఖ్యాత ఢాకేశ్వరి హిందూ దేవాలయాన్ని మంగళవారంనాడు సందర్శించారు. హిందూ పెద్దలను కలుసుకున్నారు.
బంగ్లాదేశ్లో అల్లర్ల నడుమ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాపై ఆ దేశంలో హత్య కేసు నమోదయింది. ఆమెతోపాటు మరో ఆరుగురిపై ఈ కేసు నమోదు చేసినట్లు బంగ్లాదేశ్లోని మీడియా మంగళవారం వెల్లడించింది. జులై 19వ తేదీన మొహమ్మద్పూర్లో రిజర్వేషన్ల కోసం జరిగిన ఉద్యమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో పోలీసుల కాల్పుల్లో కిరాణా దుకాణం యజమాని అబూ సయ్యద్ మరణించారు.
పొరుగునున్న బంగ్లాదేశ్లో రాజకీయంగా అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ సరిహద్దు వద్ద భారీగా భారత్.. తన బలగాలను మోహరించింది. అలాంటి వేళ.. ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్లో బంగ్లాదేశ్ జాతీయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మహమ్మద్ ఉస్మాన్ కరామట్ అలీ బిశ్వాస్గా అతడిని గుర్తించారు.
బంగాళాఖాతంలో అదొక అందాల పగడపు దీవి.. మొత్తం విస్తీర్ణం మూడు చదరపు కిలోమీటర్లే.. కానీ, ఎంతో వైవిధ్యం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యం.. ప్రత్యేకించి సైనికపరంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం..! దీంతో అమెరికా కన్నుపడింది..
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్ భారత్లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.