Home » Bangladesh Protests
రిజర్వేషన్ల రగడతో బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువత, ప్రజల టార్గెట్ మాత్రం హిందువులు, వారి ఇళ్లు అని తెలుస్తోంది. ఎక్కడ హిందువు ఇళ్లు, వ్యాపారి బిల్డింగ్ కనిపిస్తే చాలు.. ధ్వంసం చేసేందుకు క్షణం కూడా ఆలోచించడం లేదు. బంగ్లాదేశ్ అలర్లి మూకల చేతిలో ప్రముఖ జానపద గాయకుడు రాహుల్ ఆనంద ఉంటోన్న ఇళ్లు ధ్వంసమైంది. 140 ఏళ్ల సంస్కృతికి అద్దం పట్టే గల ఇళ్లు చరిత్రగా మిగిలింది.
షెడ్యూల్ ప్రకారం బుధవారం ఢాకాకు రెండు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు నడుపుతున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇక విస్తారా, ఇండిగో విమాన సర్వీసులు సైతం షెడ్యూల్ ప్రకారం నడుస్తాయంది. విస్తారా ప్రతీ రోజు ముంబయి నుంచి ఢాకాకు విమాన సర్వీస్ నడుపుతుంది. ఢిల్లీ నుంచి ఢాకాకు మాత్రం వారంలో మూడు సర్వీసులను మాత్రమే నడుపుతుందని వెల్లడించింది.
షేక్ హసీనాతోపాటు ఆమె సోదరిని వెంటనే అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు అప్పగించాలని భారత్ను ఆ దేశపు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎం మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ డిమాండ్ చేశారు. ఢాకాలో మహబూబ్ ఉద్దీన్ ఖోకాన్ మాట్లాడుతూ.. పొరుగనున్న భారత్తో సానుకూల సంబంధాలు కొనసాగించడం తమకు ముఖ్యమని స్పష్టం చేశారు.
బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవన్ కోరారు.
బంగ్లాదేశ్(Bangladesh)లో అల్లర్లు, సైనిక పాలన విధించడంతో వివిధ కోర్సులు అభ్యసించేందుకు నగరానికి వచ్చిన ఆ దేశ యువకులు ఆందోళన చెందుతున్నారు. తమ వారు ఎలా ఉన్నారోనని కంగారుపడుతున్నారు. విద్య, ఆరోగ్య తదితర రంగాల్లో హైదరాబాద్(Hyderabad)లో లభిస్తున్న అవకాశాల కారణంగా అనేకమంది నగరానికి వచ్చారు.
బంగ్లాదేశ్లో ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ వీడింది..! నోబెల్ అవార్డు గ్రహీత మహమ్మద్ యూన్సను తాత్కాలిక ప్రభుత్వాధినేతగా దేశాధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రకటించారు.
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కారణంగా షేక్ హసీనా తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ నుంచి మళ్లీ సుమారు ఐదు దశాబ్ధాల తర్వాత ప్రాణ రక్షణ కోసం భారత్ చేరుకుంది. బంగ్లాదేశ్ నుంచి సైనిక విమానంలో భారత్కు వస్తున్న క్రమంలో హసీనా వెంట తన చెల్లి రెహానా ఉన్నారు.
బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు మొదలవ్వడం.. ఆందోళనల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ప్రాణరక్షణ కోసం పొరుగు దేశానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బంగ్లాదేశ్లో(Bangladesh Crisis) రాజకీయ సంక్షోభం, హింసాత్మక నిరసనలు, ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేయడం ఇవన్నీ.. భారత వ్యాపార వర్గాలపై తీవ్ర ప్రభావం చూపాయి. షేక్ హసీనా తొలిసారి 2009లో అధికారం చేపట్టినప్పటి నుంచి, బంగ్లాదేశ్ భారత్కి కీలక మిత్రదేశంగా ఉంది.
ప్రధాని షేక్ హసీనా రాజీనామాతో బంగ్లాదేశ్ రాజకీయం సంక్షోభంలో పడింది. ఆ దేశ రాజకీయదాలు వేగంగా మారుతున్నాయి. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటుకు ఆదేశాధ్యక్షుడు ఆదేశాలు జారీచేశారు.