Home » Bandi Sanjay
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సచివాలయంలో కాంగ్రెస్ నేతలు సమీక్ష నిర్వహించడం, మంత్రివర్గ విస్తరణపై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవడం తెలంగాణలో పాలన భ్రష్టు పట్టడమేనని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి మజ్లి్స గెలిపించేందుకు పని చేస్తున్నారని అన్నారు
తెలంగాణలో కేంద్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తుందంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు.
హెచ్సీయూ భూముల మీద విచారణ చేయడానికి నటరాజన్ మీనాక్షి ఎవరని.. మంత్రులను ఆమె ఎలా కంట్రోల్ చేస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు రబ్బర్ స్టాంప్లు అని, మంత్రి వర్గం విస్తరణలో ముఖ్యమంత్రిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదని విమర్శించారు. బీజేపీ దేశ భక్తి పార్టీ అని.. ఎంఐఎం దేశ ద్రోహ పార్టీ అని ఆయన అభవర్ణించారు.
భూముల అమ్మకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎ్సను మించిపోతోందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
Bandi Sanjay Letter: కరీంనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి సహకరించాలంటూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కేంద్ర మంత్రి బండి సంజయ్ కోరారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉన్నాయని.. దీంతో ఆ పార్టీల ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయొచ్చని చెబుతున్న బండి సంజయ్.. కేంద్ర మంత్రిగా అధికారిక ప్రకటన చేస్తే రాష్ట్రంలో 24 గంటల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసి చూపుతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో కాంగ్రె్సది చేతకానితనం అని, ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది తప్పించుకోవాలనుకుంటోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
ఆ భూములను వేలం వేయడం కుదరదని.. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఆ భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు.
Bandi Sanjay Comments On HCU: హెచ్సీయూలో విద్యార్థులను అరెస్ట్ చేయడంపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలను చూస్తుంటే బాధేస్తోందని అన్నారు.