Home » Ballari
‘మాజీ మంత్రి శ్రీరాములు నాన్నకు మాట ఇచ్చాను... శ్రీరాములును ఎమ్మెల్యేగా చేస్తానని ఆరోజు ఇచ్చిన మాట నిలుపుకున్నాను అని మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్రెడ్డి(Former minister and Gangavati MLA Gali Janardhan Reddy) అన్నారు.
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులకు జీవధారగా ఉన్న తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయానికి నీరు ఉధృతంగా చేరుతోంది. జలాశయం నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరుతుండడంతో క్రస్ట్గేట్లు తెరిచి నీటిని నదికి వదులుతున్నారు.
ఆన్లైన్, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల నుండి జాగ్రత్తగా ఉండాలని జిల్లా సైబర్ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ... ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా... ప్రజలు మాత్రం అవేమి పట్టించుకోకుండా... డబ్బు ఆశతో లక్షలాది రూపాయలు పోగొట్టుకుంటున్న ఘటనలు... నిత్యం వెలుగు చూస్తున్నాయి.
మూడు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) గంగావతి నుంచి బళ్ళారికి వచ్చే సమయంలో ఆయన కాన్వాయ్కు వ్యతిరేకదిశలో వాహనాన్ని నడిపినందుకు గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి(Gangavati MLA Gali Janardhan Reddy) కారును గంగావతి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రైతులకు గాడిదలు సరఫరా చేసి వాటినుంచి సేకరించిన పాలను విక్రయించడానికి ఏర్పాటు చేసిన ‘జెన్ని మిల్క్’ స్టార్ట్ అప్ కంపెనీని అధికారులు సీజ్ చేశారు. విజయనగర(Vijayanagara) జిల్లా కేంద్రమైన హొసపేటలో ఏర్పాటయిన ఈ కేంద్రాన్ని నగరసభ కమిషనర్ చంద్రప్ప, నగరాభివృద్ధి యోజనా డైరెక్టర్ మనోహర్, పరిశీలించారు.
తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటెత్తుతోంది. జలాశయంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. డ్యాం 19వ క్రస్ట్ గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి అన్నదాత ఆవేదన పడిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో మళ్లీ జలకళ ఉప్పొంగుతోంది.
రేణుకాస్వామి హత్య కేసు నిందితుడు, కన్నడ నటుడు దర్శన్ను పోలీసులు గురువారం ఉదయం 9.30 గంటలకు భారీ బందోబస్తు మధ్య బళ్లారి జైలుకు తీసుకొచ్చారు.
తుంగభద్ర జలాశయం(Tungabhadra Reservoir) 19వ గేటుకు స్టాప్లాగ్ బిగించేందుకు ఇంజనీయర్లు, కార్మికులు ఏమాత్రం విశ్వాసం సన్నగిల్లకుండా సాహసం చేస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచి స్టాప్లాగ్ బిగించేందుకు అనేక అడ్డంకులు ఎదురయినా ఫస్ట్ ఎలిమెంట్ను స్పిల్వే మీదకు భద్రంగా చేర్చారు.
నాడు దివి నుంచి భువికి గంగను దించేందుకు భగీరథ మహర్షి మహా ప్రయత్నమే చేశారు. నేడు... తుంగభద్రమ్మను కాపాడుకునేందుకు ఇంజనీర్లు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు.
ఇంటిముందర చెరువు ఉన్నా, తాగడానికి మాత్రం నీళ్లు లేని పరిస్థితి హోస్పేట నగర(Hospet city) ప్రజలది. వారికి సమీపంలోనే టీబీ డ్యాం(TB dam) ఉన్నా నగరానికి తాగునీటి సరఫరాలో అన్నీ అడ్డంకులే.