Home » Bail
విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టులో చుక్కెదురు అయ్యింది. బెయిల్పై తనను విడుదల చేయాలంటూ జానీ వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరిని శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించాడని, దానిపైనా విచారణ జరపాలని మంగళవారం సునీత తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అవినాష్, శివశంకర్ రెడ్డి, అతని కుమారుని కేసు...ఈ మూడింటిని ఒకేసారి వినాలని ధర్మాసనానికి విజ్ణప్తి చేశారు.
జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల ముందస్తు విడుదల కోసం పిటిషన్లలో న్యాయవాదులు తప్పుడు సమాచారం ఇస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.
ఇంజనీర్ రషీద్ను టెర్రర్ ఫండింగ్ కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద 2017లో ఎన్ఐఏ అరెస్టు చేసింది. 2019 నుంచి ఆయన తీహార్ జైలులో ఉంటున్నారు.
పశ్చిమ్ బంగా ఛాత్ర సమాజ్ నాయకుడు సయాన్ లాహిరి బెయిల్ను సవాల్ చేస్తూ బెంగాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ కు సుప్రీంకోర్టు సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సుమారు 100 రోజుల పాటు జైలులో కుమార్ ఉన్నారు.