Home » Ayodhya Ram mandir
అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sri Ram) దర్శించుకోవాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఇండిగో ఎయిర్లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్రాజ్లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల అవశేషాలను నుంచి తీసిన కొవ్వును వినియోగించారంటూ ఎన్డీడీబీ నివేదిక సైతం స్పష్టం చేసింది. దీంతో తిరుపతి లడ్డూ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. అలాంటి వేళ.. ఈ అంశంపై అయోధ్య రామమందిరం ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రే దాస్ స్పందించారు.
ఉత్తరప్రదేశ్ బహ్రైచ్ జిల్లాలో అర్షద్తో 19 ఏళ్ల మరియం షరీఫ్కు ఇటీవల వివాహమైంది. ఆ జంట తాజాగా అయోధ్యలో పర్యటించింది. ఈ సందర్భంగా ఆయోధ్యలో జరిగిన అభివృద్ధి.. రామాలయ నిర్మాణం, నగరాభివృద్ధి పట్ల సంతోషం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్పై ప్రశంసల జల్లు కురిపించింది.
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత ఇప్పటివరకు 2.85 కోట్ల మంది భక్తులు వచ్చారు. కోట్లాది రూపాయల విరాళాలు అందాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. అంతేకాదు ఓ భక్తుడు 2100 కోట్ల రూపాయల చెక్కు కూడా ఇచ్చారని తెలిపారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
రామ జన్మభూమి అయోధ్యలో దొంగలు రూ.50 లక్షల విలువైన వీధి బల్బులను ఎత్తుకెళ్లారు. ఎల్లప్పుడూ భద్రతా సిబ్బంది కనుసన్నల్లో ఉండే భక్తి పథ్, రామ్ పథ్ మార్గాల వెంబడి వెదురు కర్రలకు అమర్చిన 3800
ఆధ్యాత్మిక యాత్ర ఆ కుటుంబానికి పెను విషాదం మిగిల్చింది. అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తుండగా నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆ ఉధృతికి 17 ఏళ్ల బాలిక గల్లంతైంది.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు అయోధ్యలోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల స్థలం తన కుటుంబానికి చెందినదని ఢిల్లీకి చెందిన మహిళ రాణీ పంజాబీ చెప్పారు.
సొంత ప్రతాపం కొంత ఉంటే, జబ్బలు ఎంత చరుచుకున్నా ఒక అందం. అరువు బలం మీద ఆధారపడి, అంతా తమ ప్రతాపం అంటేనే వికారం. మొదటికే మోసం వచ్చినా, మూడోసారి మహాప్రసాదమని మురిసిపోతున్న ప్రధాని మోదీ...
భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.
అయోధ్యలో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా.. ఆడ్వాణీ ప్రారంభించిన రామాలయ ఉద్యమాన్ని ఇండియా కూటమి నీరుగార్చిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.