Home » Ayodhya Ram mandir
భక్తులు భారీగా తరలివస్తుండటం, అందులోనూ ప్రయాగరాజ్ మహాకుంభమేళాకు వస్తున్న భక్తులతో అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఆలయ దర్శనం,హారతి వేళల్లో సవరణ చోటుచేసుకుంది.
ఎనభై ఐదేళ్ల సత్యేంద్ర దాస్ను ప్రాథమిక చికిత్స అనంతరం ఆదివారంనాడు ఎస్జీపీజీఐ ఆసుపత్రికి తరలించారు. మధుమేహం, హైపర్టెన్సివ్తో ఆయన బాధపడుతున్నారని, ప్రస్తుతం న్యూరాలజీ వార్డ్ హెచ్డీయూ (హై డెపెన్డెన్సీ యూనిట్)లో చికిత్స పొందుతున్నారని ఆసుపత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.
భారీగా తరలి వచ్చిన భక్తజనసందోహం మధ్య అయోధ్యలోని రామమందిరం తొలి వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
సమాజం ఎందుకు విడిపోయి ఉంది? ఆలయం లేకుండా సుదీర్ఘం కాలం రాముడు, మన దేవుళ్లు ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? అనేది ప్రజలు ఆలోచించాలని ఆదిత్యనాథ్ కోరారు.
కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ‘న్యాయానికి జరిగిన పెద్ద అవహేళన’లాంటిదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎ్ఫ.నారిమన్ అభిప్రాయపడ్డారు.
హిందూ ఆధ్యాత్మిక కేంద్రమైన అయోధ్య.. ఫైజాబాద్ లోక్సభ నియోజకవర్గంలోకి వస్తుంది. అయోధ్యలోని భవ్య రామాలయం ఈ ఏడాది మొదట్లో ప్రారంభమైంది. దీపావళి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుధవారంనాడు దీపోత్సవ్ను ఘనంగా నిర్వహించనుంది.
రోజ్గార్ మేళా కింద ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న యువకులకు కూడా మోదీ అభినందనలు తెలిపారు. దేశమంతా పండుగ వాతావరణం నెలకొందని. ఈరోజు చాలా శుభదినమని, ఎంప్లాయిమెంట్ మేళాలో 51,000 యువతకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని చెప్పారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ నుంచి అయోధ్యకు శుక్రవారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.