Home » Ayodhya Ram mandir
ఆలయంలో దోపిడీ అంటే నగదు, బంగారం, వజ్రాలను చోరీ చేయడం మాత్రమే కాదు.. భక్తుల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా దోచుకోవడం. ఇటీవల అయోధ్య రామమందిర విరాళాల చోరీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన కానుకలన్నీ భద్రంగా ఉన్నాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ స్పష్టం చేసింది. మార్చి 31, 2026 నాటికి ట్రస్ట్ ఆధీనంలో 32.259 కేజీల బంగారం.. 1,518.925 కేజీల వెండి వస్తువులు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్ చేతికి కీలక ఆధారాలు దొరికాయి. ఏప్రిల్ 27వ తేదీ నుంచి జూన్ 5వ తేదీ వరకు కౌంటింగ్ చేసిన వ్యక్తులు డబ్బులు అపహరించినట్లు సీసీ ఫుటేజీ ద్వారా సిట్ అధికారులు గుర్తించారు.
అయోధ్య రామమందిర ట్రస్ట్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వీహెచ్పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ స్పష్టం చేశారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలపై ట్రస్ట్ విచక్షణకే వదిలేస్తున్నట్లు తెలిపారు.
అయోధ్య రామ మందిర విరాళాల చోరీ నేపథ్యంలో దేవాలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్టు బోర్డు తాజాగా ఆమోదించింది.
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు అలోక్ కుమార్ స్పందించారు.
రామ మందిర విరాళాల లెక్కింపులో తనకు ఎలాంటి పాత్ర లేదని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ గిరి స్పష్టం చేశారు. ఈ ఉదంతంపై లోతైన, నిష్పాక్షిక దర్యాప్తు జరగాలని చెప్పారు.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. రామ మందిర విరాళాల అక్రమాల ఆరోపణల నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే.
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్లో నిర్వహించిన 'రామరక్ష' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ స్పందించారు. కోట్లాది మంది భక్తుల సెంటిమెంట్లతో ముడిపడి ఉన్న ఈ అంశంలో దోషులకు కఠిన శిక్ష పడాల్సిందేనన్నారు.