Home » AV Ranganath
గ్రేటర్ పరిధిలోని అక్రమ కట్టడాలన్నీ కూల్చివేసే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం హైడ్రాకు ఇచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చట్టంలో పలుమార్పులు చేసింది. జీహెచ్ఎంసీ చట్టంలో మున్సిపల్ శాఖ. 374B ప్రత్యేక సెక్షన్ చేర్చింది. దీంతో బల్దియాతో పాటు 27 మున్సిపాలిటీలు, 33 గ్రామాల పరిధిలో హైడ్రా దూకుడు పెంచనుంది.. ఇక నుంచి జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ప్రభుత్వ ఆస్తులను పరిరక్షిస్తారు.
ప్రభుత్వ అనుమతులున్న భవనాలను హైడ్రా(Hydra) కూల్చదని.. సర్వే నంబర్లు మార్చి, తప్పుడు సమాచారంతో అనుమతులు పొంది, భూములు, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై మాత్రమే చర్యలు ఉంటాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) స్పష్టం చేశారు. నగరవాసులకు మెరుగైన జీవనాన్ని కల్పించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా వందరోజులు పూర్తి చేసుకున్నదని కమిషనర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
కూకట్పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
వర్షం పడితే నగరంలోని పలు ప్రాంతాలు నీట మునగడం, రహదారులు జలమయం కావడం వంటి సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్ వాటర్ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని అధికారులు గుర్తించారు.
భవన నిర్మాణాలకు సంబంధించిన సంస్థల నుంచి అనుమతి(చెల్లుబాటయ్యే అనుమతి) తీసుకొని చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువుదీరింది. అయితే మూసీ నది పరివాహక ప్రాంతంతో పాటు రాష్ట్రంలోని చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది.
వాహనాల రాకపోకలు సాఫీగా సాగేలా, పాదచారుల భద్రత కోసం ప్రధాన రహదారుల్లో, కాలనీల్లో ఫుట్పాత్లను ఆకమ్రించిన శాశ్వత దుకాణాలను తొలగించేందుకు హైడ్రా(Hydra) సిద్ధమవుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలోని పలు అధికారాలను హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)కు బదలాయిస్తూ రాష్ట్ర పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు (జీవో-191) జారీ చేసింది.
మురుగుతో నిండిపోయిన, అసలు నీళ్లే లేని చెరువులను మంచి నీటి వనరులుగా ఎలా తీర్చిదిద్దారు? అని బెంగళూరుకు చెందిన లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడిగి తెలుసుకున్నారు.
గురువారం హైదరాబాద్లో హైడ్రా కార్యాలయంలో లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆనంద్ మల్లిగవాడ్తో హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ వీ రంగనాథ్ మాట్లాడుతూ.. చెరువుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆయన స్పష్టం చేశారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కాలనీ, బస్తీ వాసులు, స్వచ్ఛంద, కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ విభాగాలను భాగస్వామ్యం చేసి చెరువులను పునరుద్ధరించనున్నామన్నారు.