Home » AV Ranganath
డిటోనేటర్లు పెట్టి మల్కాపూర్ చెరువులో కట్టడాలను కూల్చివేసిన అధికారులు, ఇప్పుడు హైడ్రాకి, హోంగార్డు గోపాల్ చనిపోవడానికి ఎలాంటి సంబంధం లేదని చేతులు దులుపుకోవడం సిగ్గుమాలిన చర్య అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు ధ్వజమెత్తారు. ఈ సంఘటనపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. హోంగార్డు గోపాల్ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
ఓ వైపు మూసీ ఆక్రమణల మార్కింగ్.. మరోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని నిర్మాణాల కూల్చివేత..
హైడ్రా అధికారులకు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అల్టిమేటం జారీ చేశారు. హైడ్రా పేరుతో సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించకండి అని హెచ్చరించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో కూల్చివేతల పేరిట అధికారులు అతుత్సాహం ప్రదర్శించకండి అని అన్నారు.
కూల్చివేతలన్నీ హైడ్రాకు ముడిపెట్టవద్దు అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువులో హైడ్రా ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని తెలిపారు. వాటికి హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
మూసీ నదీ గర్భం (రివర్ బెడ్)లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్టప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, మూసీ రివర్ ఫ్రంట్ డెవల్పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్ఎ్ఫడీసీఎల్) ఎండీ దాన కిశోర్ తెలిపారు.
నగరంలో బుచ్చమ్మ అనే వృద్ధురాలు ఆత్మహత్య చేసుకోవడంపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath)పై మానవ హక్కుల కమిషన్(HRC) కేసు నమోదు చేసింది.
జలవనరులన్నీ ప్రజల ఆస్తులేనని వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. హైదరాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
అక్రమ నిర్మాణాలంటూ ఆగమేఘాల మీద భవనాలను కూల్చివేస్తున్న హైడ్రా తీరును హైకోర్టు తప్పుపట్టింది. ఏ అధికారంతో కూల్చివేస్తున్నారో చెప్పాలని హైడ్రా కమిషనర్ను ఆదేశించింది.
నగరంలో అక్రమ నిన్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది హైడ్రా. వరుస కూల్చివేతలతో హడలెత్తిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలున్నా.. రాత్రికి రాత్రే సదరు ప్రాంతానికి వెళ్లి.. అక్రమ కట్టడాలన్నీ కూల్చిపడేస్తున్నారు. చూస్తుండగానే నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేసేస్తున్నారు.
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సోమవారం ఉదయం 10:30 గంటలకు హాజరవ్వాలని ఆదేశించింది. కోర్టులో పెండింగ్లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని హైకోర్టు ప్రశ్నించింది.