Home » Atchannaidu Kinjarapu
రాష్ట్రంలో ఏదో ఒక రూపంలో అలజడి సృష్టించడానికి జగన్ పూనుకున్నారు. దీన్ని అడ్డుకుని తీరుతాం. ఆయన ఆటలు సాగనివ్వం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
విభజన చట్ట ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయండి. అలాగే గుంటూరులో మిర్చి బోర్డు, చిత్తూరులో మామిడి బోర్డు, శ్రీకాకుళంలో జీడిపప్పు బోర్డు ఏర్పాటు చేయండి అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రాన్ని కోరారు.
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను మంగళవారం మర్యాదపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కలిశారు. రాష్ట్రంలో రైతుల సమస్యలపై కేంద్ర మంత్రితో చర్చించారు.
రైతుయాత్ర పేరుతో జగన్ అనే దుర్మార్గుడు చేసే దండయాత్రను రైతులు అడ్డుకోవాలని వ్యవసాయ మంత్రి కె.అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు. ఐదేళ్ల పాలనలో ఆయన రైతుల కోసం ఏం చేశాడో నిలదీయాలన్నారు.
పరామర్శల పేరుతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ యాత్ర పేరుతో ఆయన బల ప్రదర్శన చేస్తున్నారని విమర్శించారు.
చిత్తూరు జిల్లాలో తోతాపురి మామిడి రైతులను ఆదుకున్నది రాష్ట్ర ప్రభుత్వమే. దీనిపై వైసీపీ ప్రబుద్ధులు కొందరు కనీస అవగాహన లేకుండా విష ప్రచారం చేస్తున్నారు అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేని వైసీపీ అధినేత జగన్... పాదయాత్ర పేరిట ఏ మొఖం పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్తాడో చెప్పాలి’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్థక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
అదేపనిగా ప్రభుత్వంపై, కూటమి పార్టీలపై రోత రాతలు రాస్తే సహించబోమని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన ధరల్లేక కుదేలైన మామిడి రైతుల పరిస్థితులను పరిశీలించారు.
రైతులకు పెట్టుబడులు తగ్గేలా, అధిక దిగుబడులిచ్చే వండగాలను అభివృద్ధి చేయాలని వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు శాస్త్రవేత్తలను కోరారు.