Home » Atchannaidu Kinjarapu
ఖరీఫ్లో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సూచించారు. ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
శ్రీకాకుళం: ఐదేళ్లలో రాష్ట్రంలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని, కొన్ని శాఖల అధికారులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కక్ష సాధింపులు ఉండవని వ్యవసాయ శాఖా మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన శ్రీకాకుళంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
కేంద్ర రాష్ట్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన కింజరాపు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు శ్రీకాకుళంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఆత్మీయ అభినందన సభ జరిగింది. శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
నేడు శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర, కేంద్ర మంత్రులైన బాబాయి, అబ్బాయి రానున్నారు. రాష్ట్ర మంత్రివర్యులు కింజారపు అచ్చెన్నాయుడు, కేంద్ర విమానయాన శాఖామాత్యులు కింజారాపు రామ్మోహన్ నాయుడు నేడు జిల్లాకు రానున్నారు. ఉదయం 9.30 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ర్యాలీ గా బయలుదేరనున్నారు.
తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి బీసీలు ఆ పార్టీకి అండగా నిలుస్తూ వస్తున్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి టీడీపీ అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. వాస్తవానికి ఏపీ జనాభాలో అత్యధికశాతం బీసీలే. గత వైసీపీ ప్రభుత్వం అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తామని గొప్పుల చెప్పుకుంది.
వ్యయసాయాభివృద్ధికి పాటుపడతా, రైతన్నలకు అండగా నిలుస్తానని వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) పేర్కొన్నారు. అందరికీ అన్నం పెట్టే రైతన్నకు సేవ చేసే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి పక్షాల నేత ఎన్నిక వేదికపై ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నేడు టీడీపీ అధినేత చంద్రబాబును శాసనసభ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి ముందు ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. ఈ వేదికపై చంద్రబాబుకు అందరి కంటే పెద్ద కుర్చీని నిర్వాహకులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు వేదిక పైకి వచ్చిన వెంటనే తనకు పెద్ద కుర్చీ వేయడాన్ని చూసి తీయించేశారు.
టీడీఎల్పీ నేతగా అధినేత చంద్రబాబు పేరును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చన్నాయుడు ప్రతిపాదించారు. అనంతరం శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో కూటమి నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రబాబు, పవన్, పురందేశ్వరి, కూటమి ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly Elections) ఎన్నికల్లో కూటమి భారీ విజయంతో ఈనెల 12న టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మెుదట జూన్ 9న ప్రమాణ స్వీకారం ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఆరోజున మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండడంతో తేదీని మార్చాల్సి వచ్చింది.
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) సోమవారం ఎన్నికల సంఘానికి (Election Commission) లేఖ రాశారు. విశాఖ కంచరపాలెంలో తమకు ఓటు వేయలేదన్న కారణంతో ఓ కుటుంబంపై వైసీపీ నేతలు దాడి చేసిన ఘటనను ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకొచ్చారు.