Home » Assam
అగర్తల-లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్ గురువారం పట్టాలు తప్పింది. దీంతో రైలులోని 8 నుంచి 10 కోచ్లు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదం అసోంలోని డిబ్లాంగ్ స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.
అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అసోంలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగు చూసింది. ఇద్దరు యువకులు కలిసి చేసిన రూ.2 వేల 200కోట్ల ఘరానా మోసం గుట్టు రట్టు చేశారు అసోం పోలీసులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దిబ్రూఘర్కు చెందిన విశాల్(22), గువహాటికి చెందిన స్వప్నిల్ దాస్ ఇరువురు స్నేహితులు.
అసోం తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధ్యక్షుడు రిపున్ బోరా ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈశాన్య రాష్ట్ర ప్రజలు టీఎంసీని తమ పార్టీగా అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రతి శుక్రవారం రెండు గంటల పాటు ఇచ్చే నమాజ్ విరామాన్ని రద్దు చేస్తున్నట్టు శుక్రవారంనాడు శాసనసభలో ప్రకటించారు. సభా కార్యక్రమాల ప్రొడక్టివిటీని పెంచడంతో పాటు వలస కాలం నాటి పద్ధతులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అభివర్ణించారు.
''బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.
అసోంలోని నగాన్ జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడం స్థానికంగా ఆందోళనలకు దారితీసింది.
ఈశాన్య రాష్ట్రం అసోంలోని నాగోన్ జిల్లాలో గురువారం రాత్రి బాలికపై సామూహిక లైంగిక దాడి జరిగింది. ట్యూషన్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా 14 ఏళ్ల బాలికపై ఈ దారుణం చోటు చేసుకుంది. రహదారిపై ఆపస్మారక స్థితిలో పడి ఉన్న బాలికను స్థానికులు గమనించి.. పోలీసులకు సమాచారం అందించారు.
గువాహటి: కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైన నేపథ్యంలో అసోంలోని ఒక ఆసుపత్రి జారీ చేసిన అడ్వయిజరీ తీవ్ర విమర్శలకు గురైంది. దీంతో ఆ అడ్వయిజరీని యాజమాన్యం ఉపసంహరించుకుంది.
లవ్ జిహాద్కు పాల్పడితే జీవిత ఖైదు శిక్ష విఽధించేలా చట్టాన్ని తీసుకొస్తామని అస్సాం సీఎం హిమాంత బిశ్వశర్మ వెల్లడించారు. లవ్ జిహాద్ను అరికట్టడానికి చట్టాన్ని రూపొందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని...