Home » Assam
అస్సాం(Assam)లోని జోర్హాట్ జిల్లాలో అటవీ శాఖ బృందంపై అడవి ఏనుగు దాడి చేయడంతో ఫారెస్ట్ ఆఫీసర్(Forest Officer) మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... జోర్హాట్లోని టిటాబోర్లోని బిజోయ్ నగర్ ప్రాంతంలో ఏనుగుల గుంపు ఆహారం కోసం అడవి నుండి బయటకు వచ్చినప్పుడు అటవీ శాఖ బృందం వాటిని తిరిగి అడవిలోకి తరిమికొట్టడానికి ప్రయత్నించింది.
పొలిటీషియన్లు ఎలాంటి రాజకీయాలు చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడంపై దృష్టి సారించకుండా.. అనవసరమైన విషయాలపై లేనిపోని రాద్ధాంతం చేస్తుంటారు. తమ ప్రత్యర్థుల్ని..
అస్సాంలోని కాచార్ జిల్లా సిల్చార్లో గల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో(ఎన్ఐటీ) ఓ విద్యార్థి ఆత్మహత్యకు నిరసనగా మిగతా విద్యార్థులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది.
మెరుగైన విద్య అందించే పాఠశాలలు చాలా ఎక్కువ డబ్బు వసూలు చేస్తాయి. కానీ ఆ పాఠశాలలో మాత్రం డబ్బులు కట్టక్కర్లేదు. దానికి బదులుగా ప్లాస్టిక్ బాటిళ్లు స్కూల్లో డిపాజిట్ చేయాలి.
అసోం ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ, లోక్సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ మధ్య తలెత్తిన మాటల యుద్ధం గురువారంనాడు తారాస్థాయికి చేరింది. గొగోయ్ ఆరోపణలపై అమీతుమీ తేల్చుకోవాలనుకుంటున్నానని, కోర్టులోనే ఆయనను కలుస్తానని తాజా ట్వీట్లో శర్మ పేర్కొన్నారు.
అస్సాం బీజేపీ నేత, ఎంపీ రాజ్దీప్ రాయ్ (Rajdeep Roy) నివాసంలో పదేళ్ల బాలుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఆ బాలుని మెడకు గుడ్డ చుట్టి ఉండగా, వేలాడుతూ కనిపించాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ మార్గమధ్యంలోనే ఆ బాలుడు మరణించినట్లు వైద్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ను నిర్దేశించింది. ఉన్నత పాఠశాలలు, కళాశాలల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఇకపై టీ-షర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివాటిని ధరించరాదని ఆదేశించింది.
తోటి ప్రజలపై తూటాల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. అంతర్గత సమస్యలకు పరిష్కారం లోపలి నుంచే రావాలని, కారుణ్యం, అవగాహనల ద్వారా పరిష్కారం కుదరాలని చెప్పారు.
ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.
‘లవ్ జీహాద్’ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల కోసం పాకులాడే పార్టీలు ‘లవ్ జీహాద్’ను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా, ఇదంతా ఓ వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.