Home » Asaduddin Owaisi
వడ్గాం: హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లి రాబోయే గుజరాత్ ఎన్నికల్లో ఓట్ల లబ్ది పొందేందుకే ఉమ్మడి పౌరస్మృతి అంశాన్ని బీజేపీ లేవనెత్తిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్లోని బనస్కాంత జిల్లా వడ్గాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, యూనిఫాం సివిల్ కోడ్ అనేది కేంద్ర పరిధిలోదని, రాష్ట్రాల పరిధిలోనిది కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పిందని అన్నారు.