Home » Arvind Kejriwal
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్(56)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై విచారణ జరిపేందుకు ఈడీకి కేంద్ర హోం శాఖ అనుమతి ఇచ్చిందని బుధవారం అధికార వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ ఇటు ఢిల్లీలోనూ, అటు పంజాబ్లోనూ శాంతి భద్రతలకు విఘాతం కల్పించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తు్న్నాయని, ప్రధానంగా కేజ్రీవాల్పై దాడి జరగవచ్చని అనుమానిస్తున్నారు.
'ఇండియా' కూటమి చెక్కుచెదరకుండా ఉండదని అఖిలేష్ తెలిపారు. ఇండియా కూటమి ఏర్పడినప్పుడు ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయో అక్కడ ఆ పార్టీలకు కూటమి మద్దతుగా నిలవాలని నేతలంతా నిర్ణయించారని గుర్తుచేశారు.
కేజ్రీవాల్ తన భార్య, పార్టీ కార్యకర్తలతో కలిసి పాదయాత్రగా రిటర్నింగ్ అధికారి కార్యాలయాని వెళ్లి నామినేషన్ పత్రాలు అందజేశారు. దీనికి ముందు కన్నాట్ ప్లేస్లోని ప్రాచీన హనుమాన్ మందిరంలో సతీసమేతంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దేశరాజధానిలో మురికికూపంగా మారిన పలు ప్రాంతాలను రాహుల్ గాంధీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పోస్ట్ చేశారు. 'ఇదీ కేజ్రీవాల్ మెరిసిపోతున్న ఢిల్లీ - పారిస్ వాలీ ఢిల్లీ' అంటూ క్యాప్షన్ పెట్టారు.
ఢిల్లీ ఓటర్లు డబ్బులకు అమ్ముడుపోవద్దని కేజ్రీవాల్ కోరారు. ఆప్ నేతలు ఎవరైనా డబ్బులు పంచినా సరే వారికి ఓటు వేయవద్దని సూచించారు. గెలుపు, ఓటముల కోసం తాము ఎన్నికల బరిలోకి రాలేదని, దేశంలో మార్పులు తెచ్చేందుకే తాము ఇక్కడ ఉ్ననామని చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో మురికివాడలన్నింటినీ కూల్చేసి, వేలాది మంది కుటుంబాలను నిరాశ్రయులను చేయాలన్నదే బీజేపీ ఆలోచన అని కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడలు కూల్చకుండా అడ్డుకున్న క్రెడిట్ తమ (ఆప్) ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
నకిలీ ఓట్లు సృష్టించేందుకు బీజేపీ కొత్త మార్గం ఎంచుకుందని సీఈసీకి రాసిన లేఖలో కేజ్రీవాల్ ఆరోపించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల తమ ఇంటి అడ్రెస్సులతో నకిలీ ఓట్లు సృష్టించుకుంటున్నారని అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు.
దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల్లో వరుసా మరోసారి అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆప్ ప్రయత్నిస్తోంది. అయితే ఆప్ పాలనకు గండి కొట్టి.. అధికార పీఠాన్ని అందుకోవాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.