Home » Arvind Kejriwal
బీజేపీకి సీఈసీ లొంగిపోవడం చూస్తుంటే ఎన్నికల కమిషన్ తన అస్థిత్వం కోల్పోయినట్టు కనిపిస్తోందని కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. ఈ నెలాఖరులతో సీఈసీ రిటైర్ అవుతుండటంతో ప్రజల మనసుల్లో ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.
ఈసారి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. అందరినీ చితకబాదుతుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం చివరి రోజున బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆప్ వలంటీర్లకు రక్షణ కల్పించాలని, కార్యకర్తలపై దాడులను నిలువరించడంలో విఫలమైన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కేజ్రీవాల్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు విజ్ఞప్తి చేశారు. దాడుల ఘటనలకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయాలని కోరారు.
ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారంనాడిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు నుంచి 'బచత్ పత్ర' ప్రచారాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.
Delhi Assembly Elections: మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, ఆప్ మధ్య ప్రధాన పోరు జరగనుంది.
యమునలో కలిపినట్టు చెబుతున్న ఆ విషం ఏమిటో కేజ్రీవాల్ వెల్లడించాలని అమిత్షా సవాలు చేశారు. మరో సవాలు కూడా విసురుతూ, ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు ఢిల్లీలోకి యమునా జలాలను నిలిపివేయాలని ఇచ్చిన అధికారిక ఉత్వర్వులను ఢిల్లీ సీఎం చూపించాలని అన్నారు.
కేజ్రీవాల్ చేసిన ఆరోపణలు చాలా తీవ్రమైనవని ఈసీ పేర్కొంటూ ఇందుకు ఆధారాలు ఉన్నాయా అని ఆయనను ప్రశ్నించింది. జాతీయ భద్రతకు, ప్రజాసామరస్యానికి భంగం కలిగించే ఆకతాయి స్టేట్మెంట్లు విషయంలో మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధిస్తూ తీర్పులు వెలువడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేసింది.
విదేశాల్లో సీట్లు వచ్చినప్పటికీ అందుకయ్యే ఖర్చు భరించలేక చదువులకు దూరంగా ఉండిపోతున్న దళిత విద్యార్థులను తాము చదివిస్తామని, ఆప్ కీలక గ్యారెంటీలలో ఇది ఒకటని కేజ్రీవాల్ చెప్పారు. దళిత విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.
కేజ్రీవాల్ సెక్యూరిటీ నుంచి పంజాబ్ పోలీసు సిబ్బందిని ఎన్నికల కమిషన్ ఇటీవల ఉపసంహరించింది. ఈ క్రమంలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం గుజరాత్ ఎస్ఆర్పీఎఫ్ బలగాలను మోహరిస్తూ ఆర్మ్డ్ విభాగం అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం సర్క్యులర్ జారీ చేసింది.
కేజ్రీవాల్ను ఎలాగైనా మట్టుబెట్టాలన్నదే బీజేపీ ఏకైక లక్ష్యమని అతిషి ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి ఎలాంటి హింసాకాండ, దాడులు జరగలేదని ఒప్పుకోవాలంటూ ఆప్ కార్యకర్తలపై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు.