Home » Arvind Kejriwal
Delhi Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ అయింది. అయితే ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
Delhi Assembly Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు వేళైంది. ఢిల్లీని ఏలేది ఎవరో ఇవాళ తేలిపోనుంది. కొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. ఈ నేపథ్యంలో గద్దెనెక్కాలంటే ఎంత మ్యాజిక్ ఫిగర్ కావాలో ఇప్పుడు చూద్దాం..
ఎగ్జిట్ పోల్స్ తమను తక్కువగా అంచనా వేసిన ప్రతిసారి అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయని, ఈసారి కూడా ఆప్దే గెలుపని, నాలుగోసారి కేజ్రీవాల్ సీఎం పగ్గాలు చేపడతారని ఆమ్ ఆద్మీ పార్టీ ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి? జరిగిందేమిటి? ఒకసారి విశ్లేషిద్దాం.
ఆప్ చేసిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శుక్రవారంనాడు అదేశించారు. దీంతో ఏసీబీ అధికారులు ఫిరోజ్షా రోడ్డులోని కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. అయితే, నోటీసు లేకుండా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆప్ నేతలు ఏసీబీ అధికారులను లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
Delhi ACB: ఆమ్ ఆద్మీ పార్టీ నేతల వ్యాఖ్యలపై ఢిల్లీ ఏసీబీ జెట్ స్పీడ్లో రియాక్ట్ అయింది. ఆప్ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్తో పాటు ఇతర నేతల ఇళ్లకు ఏసీబీ అధికారులు వెళ్తున్నారు. అసలు హస్తినలో ఏం జరుగుతోంది? అనేది ఇప్పుడు చూద్దాం..
ఢిల్లీ శాసనసభలో మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయి. మెజార్టీ మార్క్ ఏ పార్టీకి దాటబోతుంది. హంగ్ వస్తే కాంగ్రెస్ కీలకంగా మారబోతుందా..
ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నా.. అందరి దృష్టి మూడే మూడు నియోజకవర్గాలపై నెలకొంది. ఆప్ నుంచి ముగ్గురు కీలక నేతలు పోటీ చేస్తుండటంతో ఆ మూడు నియోజకవర్గాలకు అధిక ప్రాధాన్యత ఏర్పడింది.
ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. సాయంత్రం పలు సర్వే సంస్థలు ఎన్నికల ఫలితాలపై తమ అంచనాలను ప్రకటించబోతున్నాయి. ఈ సంస్థల అంచనా ఎలా ఉండబోతుంది.. కేకే సర్వే ఎలాంటి అంచనాలు ఇవ్వబోతుంది..
దేశరాజధాని ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు సాయంత్రం 6 వరకూ పోలింగ్ జరగనుంది. ఉదయం 11 గంటల వరకూ దాదాపు 20 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలోనే గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్న ఆప్ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ పోలీసులపై ఫైర్ అయ్యారు. ప్రతి 200 మీటర్లకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు ఓటు వేయడానికి ఎలా వస్తారు? అని ఆరోపణలు చేసారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచే స్థానాలపై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంచనా వేశారు. మహిళలు పూర్తి స్థాయిలో ఓటు వినియోగించుకుంటే మరిన్ని సీట్లు తథ్యమని చెప్పారు.