Home » Arvind Kejriwal
ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యూడిషియల్ కస్టడీని తీస్ హజారీ కోర్టు మరోసారి పొడిగించింది. అతడి జ్యుడిషియల్ కస్టడీ జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేజ్రీవాల్కు ట్రయిల్ కోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్ ఆదేశాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనకు బెయిల్ దొరికిందని ఆనందించేలోపే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు గురువారం..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీమ్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా..
ఢిల్లీ హైకోర్టులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయనకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 3వ తేదీ వరకూ బుధవారంనాడు పొడిగించింది. ఆయనతో పాటు కేసులో మరో నిందితుడు వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని సైతం జూలై 3 వరకూ కోర్టు పొడిగించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భార్య సునీతా కేజ్రీవాల్కు(Sunita Kejriwal) హైకోర్టు(high court) నుంచి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసు కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్తో పాటు ఇతరులకు హైకోర్టు నోటీసులు(notices) పంపించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ తన పక్షాన్ని కోర్టులో హాజరుపరుస్తున్న వీడియోను(video) తొలగించాలని హైకోర్టు కోరింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు తావులేదని స్పష్టం చేసింది. తమ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతుందని తేల్చి చెప్పింది. ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు గురువారం సమావేశం అయ్యారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో ఉన్న తనకు వైద్య పరీక్షల నిమిత్తం 7 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని...
ఎక్సైజ్ పాలసీ కేసు నిందితుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహారు జైలు అధికారులకు లొంగిపోయారు. వెంటనే ఆయనను రౌస్ అవెన్యూ కోర్టు డిప్యూటీ జడ్జి సంజీవ్ అగర్వార్ ముందు హాజరుపరిచారు. ఈనెల 5వ తేదీ వరకూ కేజ్రీవాల్కు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.